రాష్ట్రీయం

టోల్ టాక్స్ రద్దు ( రేపు అర్థరాత్రి వరకు ఉచితం)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 9: టోల్ ప్లాజాల్లో ఈ నెల 11వ తేదీ అర్థరాత్రి వరకూ టాక్స్ చెల్లించాల్సిన అవసరం లేదు. ప్రధాని నరేంద్ర మోదీ 500, వెయ్యి రూపాయల నోట్లను మంగళవారం అర్థరాత్రి నుంచి రద్దు చేస్తున్నట్లు ప్రకటించడంతో దేశవ్యాప్తంగా అనేకచోట్ల టోల్ ప్లాజాల్లో ఈ నోట్లను తీసుకోవడం లేదు. దీంతో ఎక్కడికక్కడ ట్రాఫిక్ కిలోమీటర్ల మేర నిలిచిపోతోంది. ఈ పరిస్థితిని గమనించిన కేంద్ర ప్రభుత్వం శుక్రవారం అర్థరాత్రివరకూ టోల్‌టాక్స్‌ను రద్దు చేసింది.