రాష్ట్రీయం

‘క్యూ’లో గుండెపోటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 15: హైదరాబాద్ మారెడ్‌పల్లిలో మంగళవారం విషాదం చోటుచేసుకుంది. మంగళవారం ఓ రిటైర్డ్ ఉద్యోగి బ్యాంకులో డిపాజిట్ చేసేందుకు వచ్చి గుండెపోటుతో మృతి చెందాడు. అనంతపురంకు చెందిన లక్ష్మణ్‌రావు(78) రిటైర్డ్ రైల్వే ఉద్యోగి. గత కొనే్నళ్లుగా సికిందరాబాద్‌లోని రైల్వే కాలనీలో నివాసముంటున్నారు. మంగళవారం మధ్యాహ్నం గం. 11.00లకు సికిందరాబాద్, మారేడ్‌పల్లిలోని ఆంధ్రాబ్యాంక్‌లో రూ.1.5లక్షలు డిపాజిట్ చేసేందుకు క్యూలో నిలబడ్డారు. దాదాపు రెండు గంటల సేపు నిల్చోవడంతో అస్వస్థతకు గురయ్యాడు. స్పృహ కోల్పోయిన అతణ్ని ఆసుపత్రికి తరలించే క్రమంలో గుండెపోటుకు గురయ్యాడు. మార్గమధ్యంలోనే మృతి చెందినట్టు నార్త్‌జోన్ డిసిపి సుమతి తెలిపారు. ఇదిలావుండగా బ్యాంక్ ఎదుట ఖాతాదారులు ఆందోళనకు దిగారు. బ్యాంక్‌లో వృద్ధులకు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయాలని, విత్‌డ్రా, డిపాజిట్, ఎక్సేంజ్‌లకు వేర్వేరు ‘క్యూ’ ఉండేలా చూడాలని డిమాండ్ చేశారు.