రాష్ట్రీయం

13న విశ్వనగర్‌లో దత్తజయంతి వేడుకలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, డిసెంబర్ 5: మార్గశిర పౌర్ణమి గురుదత్త జయంతి సందర్భంగా విశ్వగురు పీఠంలో ఈ నెల 13న దత్తజయంతి మహోత్సవాలు నిర్వహించనున్నారు. విశ్వగురు పీఠాధిపతి శ్రీ విశ్వయోగి విశ్వంజీ మహరాజ్ దివ్య ఆశీస్సులతో విశ్వశాంతికి, ప్రకృతి వైపరీత్యాల నుండి భూమాతను పరిరక్షించుకునేందుకు, సకల మానవుల సంక్షేమాన్ని కాంక్షిస్తూ నిర్వహించే ఈ ఉత్సవాల్లో భాగంగా సామూహిక లక్ష తులసీ దళాలు, లక్ష పుష్పాలతో దత్తాత్రేయ స్వామికి విశిష్ఠ అర్చనలు జరుగుతాయి. త్రిమూర్తి స్వరూపుడైన దత్తాత్రేయుడు జన్మించిన పవిత్ర పర్వదినాన్ని దత్తజయంతిగా పాటిస్తున్నారు. ఇందుకు అనుగుణంగా విశ్వనగర్‌లో దత్తజయంతి మహోత్సవాలు ఏటా ఘనంగా నిర్వహిస్తున్నారు. ఉదయం నుండి వేదపఠనం, మంత్ర పారాయణ, గోపూజ, రుద్రాక్ష, కుంకుమార్చన, లక్షతులసీ దళార్చన, మారేడుదళ సహిత నానావిధ లక్షపుష్పార్చన వంటి ప్రత్యేక పూజలు, సామూహిక దత్తవ్రతం ఈ ఏడాది ప్రత్యేకతలని గురుపీఠం నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా ‘్భమాత సంరక్షణలో మేధావుల పాత్ర’ అంశంపై చర్చాగోష్టి నిర్వహిస్తారు. దత్తజయంతి సందర్భంగా స్వామీజీ ఆశీపూర్వక అనుగ్రహభాషణ చేస్తారు.