రాష్ట్రీయం

నేటి నుంచి ధనుర్మాసం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భద్రాచలం, డిసెంబర్ 15: నేటి నుంచి శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో ధనుర్మాసోత్సవాలు ప్రారంభమవుతాయి. ఈ సందర్భంగా శుక్రవారం దేవస్థానం అర్చకులు తెల్లవారుఝామున మేళతాళాలు, వేద మంత్రోచ్ఛరణల మధ్య గోదావరికి వెళ్లి తీర్థ బిందె తెస్తారు. తెల్లవారుఝామున 4.46 గంటల సమయంలో మూలవరులకు స్నపన తిరుమంజనం నిర్వహించి సుప్రభాత సేవ చేస్తారు. అనంతరం బాలభోగం సమర్పిస్తారు. 30 రోజులపాటు గోదాదేవి రచించిన పాశురాలను రోజుకొకటి పారాయణం చేస్తారు. సుమారు నెల రోజుల పాటు భక్తులంతా ఈ వ్రతాన్ని పాటిస్తారు. చివరి రోజున గోదా కల్యాణం జరుగుతుంది.