రాష్ట్రీయం
షారుఖ్ఖాన్కు యాష్ చోప్రా అవార్డు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Friday, 30 December 2016
హైదరాబాద్, డిసెంబర్ 29: యాష్ చోప్రా జాతీయ స్మారక అవార్డును బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్కు ఇవ్వనున్నట్లు టిఎస్ఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు డాక్టర్ టి సుబ్బరామిరెడ్డి ప్రకటించారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 25వ తేదీన ముంబాయిలో జెడబ్ల్యు మారియట్ హోటల్లో జరిగే కార్యక్రమంలో ఈ అవార్డును ప్రదానం చేస్తారు. అవార్డు ఎంపిక కమిటీలో రాజ్యసభ సభ్యులు డాక్టర్ సుబ్బరామిరెడ్డి, యాష్ చోప్రా భార్య పమేలా చోప్రా, పద్మిని కోల్హాపురి, బోనీ కపూర్ ఉన్నారు. ఈ అవార్డు కింద పది లక్షల విలువ చేసే బంగారు పతకం, ప్రశంసాపత్రం ఇస్తారు. ఈ అవార్డు కార్యక్రమంలో బాలీవుడ్ ప్రముఖులు పాల్గొంటారు.