రాష్ట్రీయం

కాజీపేట-విశాఖపట్నం మధ్య మరో ఐదు ప్రత్యేక రైళ్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 13: కాజీపేట్-విశాఖపట్నం మధ్య మరో ఐదు ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్టు దక్షిణ మధ్య రైల్వే శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది. కాజీపేట్-విశాఖపట్నం జనసాధారణ్ ప్రత్యేక రైళ్లు విజయవాడ మీదుగా నడుస్తాయని, ఈ ప్రత్యేక రైళ్లు వరంగల్, ఖమ్మం, విజయవాడ, ఏలూరు, తాడేపల్లిగూడెం, రాజమండ్రి, సామల్‌కోట, తుని, అనకాపల్లి, దువ్వాడ స్టేషన్లలో నిలుస్తాయని అధికారులు తెలిపారు. అదేవిధంగా మచిలీపట్నం-సికిందరాబాద్ రైళ్లు గుంటూరు మీదుగా నడుస్తాయని, ఈ రైళ్లు గుడివాడ, విజయవాడ, గుంటూరు, సత్తెనపల్లి, పిడుగురాళ్ల, మిర్యాలగూడ, నల్గొండ స్టేషన్లలో ఆగుతాయని తెలిపారు. ఈ రైళ్లను ఈ నెల 16వరకు నడిపించనున్నట్టు అధికారులు పేర్కొన్నారు.