ఆంధ్రప్రదేశ్‌

అంతటా ఉత్కంఠ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, జనవరి 25: అందరి దృష్టి విశాఖ పైనే ఉంది. మొన్నటి వరకూ అంతగా పట్టించుకోని ప్రత్యేక హోదా ఉద్యమం ఒక్క సారిగా ఊపిరిపోసుకుంది. తమిళనాడులో జల్లికట్టు ఉద్యమంతో అనుకున్నది సాధించుకున్న తమిళుల పోరాటపటిమను స్ఫూర్తిగా తీసుకుని ప్రత్యేక హోదా కోసం ఉద్యమించాలని సమాయత్తం కావడం, దీనికి కొన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు మద్దతు పలకడంతో ఉద్యమానికి కొత్త రూపు సంతరించుకుంటోంది. హోదా ఉద్యమాన్ని ఈ నెల 26న గణదినోత్సవం సందర్భంగా ఉధృతం చేయాలని అన్ని వర్గాలు భావించాయి. దీనిలో భాగంగానే ఆంధ్రా యువత పేరిట జనసేన ప్రతినిధులు ఆర్‌కె బీచ్ వేదికగా వౌన దీక్ష చేపట్టడం, అదే రోజు సాయంత్రం వైకాపా ఆధ్వర్యంలో ఆర్‌కె బీచ్ నుంచి కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించాలని నిర్ణయించాయి. దీంతో ఆర్‌కె బీచ్ వైపే రాష్ట్రం చూస్తోందనడంలో సందేహం లేదు. ఇక అధికార, విపక్ష నేతలిద్దరూ ఈ నెల 26న విశాఖలో గడపనున్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలని, అందుకు కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని పిలుపునిస్తూ అన్ని జిల్లా కేంద్రాల్లోను కొవ్వొత్తుల ర్యాలీలు నిర్వహించాలని వైకాపా అధినేత జగన్ పిలుపనిచ్చారు. ఉద్యమంలో భాగంగా విశాఖలో గురువారం సాయంత్రం అర్‌కె బీచ్ వేదికగా జరిగే ప్రదర్శనలో తాను స్వయంగా పాల్గొంటానంటూ ప్రకటించారు. అన్నట్టే గురువారం సాయంత్రం జగన్ విశాఖ చేరుకుని ఆర్‌కె బీచ్‌లో వైకాపా తలపెట్టిన ర్యాలీలో పాల్గొనేందుకు సిద్ధపడ్డారు. అయితే గణతంత్ర దినోత్సవం, అనంతరం రెండు రోజుల పాటు విశాఖ వేదికగా జరుగుత్నున రెండవ భాగస్వామ్య సదస్సు దృష్ట్యా ఎటువంటి ప్రదర్శనలు, ర్యాలీలు, సభలకు అనుమతి లేదంటూ పోలీసు యంత్రాంగం ఇప్పటికే స్పష్టం చేసింది. అయినప్పటికీ విపక్ష నేత విశాఖ ర్యాలీలో పాల్గొనేందుకే సిద్ధ పడుతున్నారు. ఆర్‌కె బీచ్ నుంచి పార్క్ హోటల్ జంక్షన్ వరకూ ప్రదర్శనలో పాల్గొంటారు. ఇక రెండు రోజుల పాటు విశాఖలో జరిగే భాగస్వామ్య సదస్సులో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురువారం రాత్రి 8 గంటలకే విశాఖ చేరుకోనున్నారు. ఆర్‌కె బీచ్‌కు సమీపంలోని నోవాటెల్ హోటల్‌లో ఆయన బసచేయనున్నారు. దీంతో ఒకే సమయంలో అధికార, విపక్ష నేతలిద్దరూ విశాఖలోనే గడపనున్నారు. అయితే వైకాపా తలపెట్టిన కొవ్వొత్తుల ర్యాలీకి పెద్ద ఎత్తున జన సమీకరణ చేస్తోందని సమాచారం. ఇప్పటికే నగరంలో పోలీసు ఆంక్షలు అమల్లో ఉన్నాయి. అనుమతి లేకుండా సమావేశాలు, ప్రదర్శనలు నిర్వహించకూడదని, ఎవరైన ధిక్కరిస్తే చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరిస్తున్నారు. దీనికి తోడు ఆంధ్రా యువత పేరిట జనసేన కార్యకర్తలు ప్రత్యేక హోదా కోసం గురువారం ఉదయం నుంచి రాత్రి వరకూ ఆర్‌కె బీచ్ వేదిగా వౌన దీక్ష చేపట్టనున్నట్టు ప్రకటించారు. దీనికి కూడా పోలీసులు అనుమతివ్వలేదు. వౌన దీక్షకు కూడా పెద్ద ఎత్తున కార్యకర్తలు, యువతను సమీకరిస్తున్నారు. ఇప్పటికే ఆర్‌కె బీచ్‌లో వైకాపా, ఆంధ్రా యువత తలపెట్టిన ప్రదర్శనలకు పెద్ద సంఖ్యలో జనం తరలివచ్చే అవకాశం ఉందని పోలీసు వర్గాలు భావిస్తున్నాయి.