రాష్ట్రీయం

పథకాల తాయలాలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 6: సర్కారు పదవీకాలం సగం పూర్తికావడంతో, వచ్చే ఎన్నికల్లోనూ అధికార పగ్గాలు చేజిక్కించుకునేలా అధికార తెలంగాణ రాష్ట్ర సమితి వ్యూహరచన చేస్తోంది. తిరిగి అధికారంలోకి తీసుకురాగలిగిన స్థాయిలో ఉన్న ఓటు బ్యాంక్‌పై తెరాస అధినేత, ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు దృష్టి సారించారు. ఎస్సీ వర్గాలకు దగ్గరయ్యేందుకు ఎస్సీ వర్గీకరణ, మైనార్టీలకు దగ్గరయ్యేందుకు 12 శాతం రిజర్వేషన్లు, గురుకుల విద్యాసంస్థల ఏర్పాటు, బీసీ సామాజిక వర్గాలకు దగ్గరయ్యేందుకు మత్స్యకారులు, యాదవుల సంక్షేమానికి పెద్దఎత్తున నిధులు కేటాయింపు, బీసీ ఉప ప్రణాళిక ఏర్పాటుకు కసరత్తు చేస్తున్నారు. జనాభాలో సగభాగమైన మహిళల కోసం ప్రభుత్వం కొత్త పథకాలు ప్రవేశ పెట్టడానికీ కసరత్తు చేస్తోంది. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వానికి ఒకవైపు సానుకూలంగా ఉంటూనే, మరోవైపు రాష్ట్రంలో మిత్రపక్షంగా ఉన్న ఎంఐఎం పార్టీతో సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవడానికి సిఎం వ్యూహాత్మకంగా అడుగులేస్తున్నారు. ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు కల్పించడానికి చిత్తశుద్ధితో ముఖ్యమంత్రి కృషి చేస్తున్నారన్న నమ్మకాన్ని కల్పిస్తున్నారు. ఇప్పటికే ఈ వర్గాలకు షాదీ ముబారక్ పథకం అమలు, మైనార్టీ విద్యార్థులకు ఓవరీస్సిస్ స్కాలర్ షిప్‌లు కల్పించింది. తాజాగా మైనార్టీలకు ప్రత్యేకంగా గురుకుల విద్యాసంస్థలు ఏర్పాటు చేయడం, మసీదుల్లో ఇమామ్, వౌజమ్‌లకు నెలనెలా రూ.15 వందల పారితోషకం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. శాసనసభ శీతాకాల సమావేశాల్లో మైనార్టీ సంక్షేమంపై జరిగిన చర్చ సందర్భంగా ఎంఐఎం పార్టీ చేసిన డిమాండ్లన్నింటికీ సిఎం అంగీకరించారు. రూ.40 కోట్లతో ఇస్లామిక్ సెంటర్ ఏర్పాటు చేయనున్నట్టు సిఎం ప్రకటించారు. పరిశ్రమల స్థాపనలో మైనార్టీలకు ప్రత్యేక కోటా కేటాయిస్తామన్నారు. అలాగే రాష్ట్ర జనాభాలో 15-16 శాతంగా వున్న ఎస్సీ ఓట్లకు గాలం వేయడానికి వర్గీకరణ బిల్లును భుజానికెత్తుకుని కేంద్రంపై ఒత్తిడి తెస్తున్నారు. అన్ని పార్టీలకు చెందిన ఎస్సీ ప్రజాప్రతినిధులతో సిఎం కెసిఆర్ ఇటీవల ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఎస్సీల సంక్షేమానికి ఇంకా ఏంచేయాలో అధ్యయనం చేసి నివేదిక ఇవ్వడానికి ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అధ్యక్షతన కమిటీ ఏర్పాటు చేయగా, ఎస్టీల సంక్షేమంపై అధ్యయనానికి మంత్రి చందూలాల్ అధ్యక్షతన కమిటీ ఏర్పాటు చేశారు. రాష్ట్ర జనాభాలో దాదాపు సగం జనాభా కలిగిన వెనుకబడిన వర్గాలకు చెందిన ఓటర్ల మెప్పుకోసం కుల వృత్తులపై దృష్టి సారించారు. బీసీల్లో ప్రధానంగా ముదిరాజ్, యాదవులు, గౌడ్లు ప్రధాన సామాజిక వర్గాలు. ఈ వర్గాల సంక్షేమానికి కుల వృత్తులకు వచ్చే బడ్జెట్‌లో పెద్ద మొత్తంలో నిధులు కేటాయించాలని యోచిస్తోంది. ఎస్సీ, ఎస్టీ వర్గాల మాదిరిగా బీసీ ఉప ప్రణాళిక ఏర్పాటుకూ ప్రభుత్వం యోచిస్తోంది. మత్స్యకారుల కోసం కాకతీయ మిషన్ కింద పునరుద్ధరించిన చెరువులలో చేపల పెంపకాన్ని ఇప్పటికే ప్రారంభించింది. యాదవ, కురుమ సామాజిక వర్గాల కులవృత్తి గొర్రెల పెంపకానికి బడ్జెట్‌లో పెద్దమొత్తంలో నిధులు కేటాయించడానికి కసరత్తు చేస్తోంది. మహిళల్లో ఇప్పటికే వితంతువులు, వృద్దులు పెన్షన్లు పొందుతుండగా ఒంటరి మహిళలకు ఏప్రిల్ నుంచి పెన్షన్లు కసరత్తు చేస్తోంది. సుమారు రెండు లక్షల మంది ఒంటరి మహిళలున్నట్టు ఇప్పటికే ప్రభుత్వానికి నివేదిక అందింది. ఇలాఉండగా సమాజంలో అధిక శాతం ఉన్న సామాజిక వర్గాల అభ్యున్నతికి కొత్త పథకాలకు శ్రీకారం చుట్టడం ద్వారా వచ్చే ఎన్నికల్లోనూ తిరిగి అధికార పగ్గాలు చేపట్టే దిశగా సిఎం వ్యూహరచన చేస్తున్నారు.