రాష్ట్రీయం

పార్టీలు, కోటీశ్వరుల్ని నమ్ముకోలేదు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం, ఫిబ్రవరి 9: తన ఎదుగుదలను అడ్డుకోవడం ద్వారా రాజకీయ భవిష్యత్తును పొందాలనుకున్న వారికి ప్రజలే గుణపాఠం చెబుతారని, తానెప్పుడూ ప్రజలనే నమ్ముకున్నానని తెలంగాణ రాష్టమ్రంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. తన 35ఏళ్ళ రాజకీయ జీవితంలో తానున్న పార్టీల్లోని నేతలు కూడా తన ఎదుగుదలను అడ్డుకునే ప్రయత్నం ద్వారానే రాజకీయ భవిష్యత్తు సాధించుకునే ప్రయత్నం చేశారని, చేస్తున్నారని సంచలన ప్రకటన చేశారు. సత్తుపల్లి మండలం తుంబూరులో గురువారం జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ తన రాజకీయ జీవితంలో ప్రతినిత్యం తనను బదనాం చేసేవారు, అంతర్గతంగా తనపై కుట్రలు చేసేవారు ఉన్నారని, వారిని ప్రజాబలంతోనే ఎదుర్కొంటున్నానన్నారు.
తన ఎదుగుదలను అడ్డుకుంటేనే వారికి రాజకీయ భవిష్యత్తు ఉంటుందని భావిస్తూ తనపై అంతర్గతంగా కుట్రలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అనవసరమైన, అసందర్భమైన అంశాలను ప్రస్తావిస్తూ ఆరోపణలు గుప్పిస్తున్నారని దుయ్యబట్టారు. తాను కోటీశ్వరులను, రాజకీయ పార్టీలను నమ్ముకోలేదని, ప్రజలనే నమ్ముకున్నానని స్పష్టం చేశారు. వారి అభివృద్ధి కోసమే అనునిత్యం ప్రయత్నిస్తానని, వారి అండతోనే తాను ఈ స్థాయికి ఎదిగానని వెల్లడించారు. ఇదిలా ఉండగా తుమ్మల ప్రకటన ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సంచలనం కలిగించింది. దశాబ్దాల కాలంగా ఎప్పుడూ చేయని విధంగా ప్రత్యర్థులపై ఆరోపణలు గుప్పించడం రాజకీయవర్గాల్లో కలకలం రేపింది. రెండు జిల్లాల పరిధిలో గురువారం అన్నిచోట్ల ఈ అంశంపైనే చర్చ జరుగుతుండటం గమనార్హం.