రాష్ట్రీయం

ఈ ఏటి మేటి ఆంధ్రప్రదేశ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఫిబ్రవరి 28: ప్రతిష్ఠాత్మక ‘స్టేట్ ఆఫ్ ద ఇయర్’ పురస్కారానికి ఆంధ్రప్రదేశ్ ఏకగ్రీవంగా ఎంపికైంది. సీఎన్‌బిసి టివి 18 సంస్థ అందించే ఇండియా బిజినెస్ లీడర్ అవార్డుల్లో భాగంగా ఏపికి ఈ పురస్కారం దక్కింది. బ్యాంకింగ్, పారిశ్రామిక రంగాలకు చెందిన జాతీయస్థాయి ప్రముఖులతో కూడిన జ్యూరీ ఈ ఎంపిక జరిపింది. పురస్కార ప్రదానం మార్చి 23న జరుగనున్నది. వివిధ రంగాల్లో సాధించిన విజయాలను పరిగణనలోకి తీసుకుని ప్రభుత్వాలకు, సంస్థలకు, వ్యక్తులకు సిఎన్‌బిసి టీవి 18 సంస్థ ఏటా ఈ పురస్కారాలను అందజేస్తుంది. ఈసారి ‘స్టేట్ ఆఫ్ ద ఇయర్’ పురస్కారానికి ఆంధ్రప్రదేశ్ అందరి ఆమోదంతో ఎంపికైంది. పురస్కారాల జ్యూరీలో హెచ్‌డిఎఫ్‌సి సిఎండి ఆదిత్యపురి, స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా సిఎండి అరుంధతి భట్టాచార్య, కెకెఆర్ సంస్థ సిఈవో సంజయ్ నాయర్, ప్రసిద్ధ కార్పొరేట్ న్యాయవాది సైరిల్ ప్రోఫ్ తదితరులు ఉన్నారు.