రాష్ట్రీయం

నేటి నుంచే ఇంటర్ పరీక్షలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఫిబ్రవరి 28:ఇంటర్మీడియెట్ పరీక్షలు బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఇందుకోసం రాష్టవ్య్రాప్తంగా ఏర్పాటైన 1445 పరీక్షా కేంద్రాల్లో పకడ్బందీగా ఏర్పాట్లు జరిగాయి.ముందుగానే పరీక్షా కేంద్రాలు పరిసరాల్లో 144 సెక్షన్‌ను విధించారు. పరీక్షా కేంద్రాల సమీపంలోని జిరాక్స్ మిషన్ల షాపులు తెరువరాదంటూ బోర్డు కార్యదర్శి ఉదయలక్ష్మి ఆదేశాలు జారీ చేశారు. ఆమె ఇప్పటికే పలుమార్లు ఏర్పాట్లపై కలెక్టర్లతో సమీక్ష జరిపారు. మొదటి సంవత్సరం విద్యార్థులు 5,23,099 మంది హాజరవుతున్నారు. వీరిలో బాలురు 2,63,081 మంది, బాలికలు 2,60,018 ఉన్నారు. ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 5,08,186 మంది హాజరవుతుంటే వీరిలో బాలురు 2,58,566 మంది, బాలికలు 2,49,620 మంది ఉన్నారు.