రాష్ట్రీయం
శ్రీవారికి స్వర్ణ శఠారి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Wednesday, 8 March 2017
తిరుపతి, మార్చి 7: తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామికి టిటిడి బోర్డుసభ్యుడు, తెలంగాణ రాష్ట్రం ఖైరతాబాద్ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి తన కుమారుడు ఖగేంద్ర రామానుజ జన్మదినాన్ని పురస్కరించుకొని రూ.17 లక్షల విలువచేసే స్వర్ణ శఠారిని మంగళవారం స్వామివారికి కానుకగా సమర్పించారు. 502 గ్రామల బరువు కలిగిన ఈ బంగారు శఠారిని చింతల రామచంద్రారెడ్డి కుటుంబ సమేతంగా ఆలయంలోకి తీసుకెళ్లి అర్చకస్వాములకు అందజేశారు. ఈసందర్భంగా స్వామివారిని దర్శించుకున్న చింతల కుటుంబానికి రంగనాయక మండపంలో వేదపండితులు వేద ఆశీర్వచనం చేశారు. టిటిడి అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.