రాష్ట్రీయం

నలుగురు మంత్రులకు హైకోర్టు నోటీసులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 18: ఆంధ్ర ప్రభుత్వంలో మంత్రులుగా పనిచేస్తున్న నలుగురికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. వైకాపా నుంచి ఎన్నికై తెదేపాలో చేరి మంత్రులుగా పనిచేస్తుండటంపై కోర్టు నోటీసులు జారీ చేసింది. మంత్రులు ఇలా పని చేయడం రాజ్యాంగ ఉల్లంఘనగా పేర్కొంటూ శివప్రసాద రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు విచారణ జరిపింది. తెలంగాణలోని తలసాని కేసునూ వీటితో కలపాలని పిటిషనర్ తరఫున న్యాయవాది కోర్టును కోరారు. ఆ విషయాన్ని కోర్టు విచారణలో ప్రస్తావించాలని ధర్మాసనం స్పష్టం చేసింది. పార్టీ ఫిరాయించి, ప్రభుత్వంలో చేరిన కేసులన్నింటినీ కలపాలని హైకోర్టు రిజిస్ట్రీని ధర్మాసనం ఆదేశించింది. వైకాపా నుంచి ఎన్నికై తెదేపాలో మంత్రులుగా కొనసాగుతోన్న విషయంపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, వైకాపాతో సహా మంత్రులు ఆదినారాయణరెడ్డి, ఎస్ కృష్ణ రంగారావు, ఎన్ అమరనాథ్‌రెడ్డి, భూమా అఖిలప్రియను నాలుగు వారాల్లో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది. కేసును తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేష్ రంగనాథన్, జస్టిస్ టి రజనితో కూడిన ధర్మాసనం విచారించింది. పిటిషనర్ తరఫున న్యాయవాది ఆనంద కుమార్ కపూర్ వాదనలు వినిపిస్తూ రాజ్యాంగంలోని పదవ షెడ్యూల్ నిబంధనల ప్రకారం పార్టీ ఫిరాయించిన వారు చట్టసభల్లో సభ్యులుగా కొనసాగడానికి వీల్లేదన్నారు. పార్టీ ఫిరాయించిన వారు మంత్రి పదవుల్లో కొనసాగడం రాజ్యాంగ ఉల్లంఘన అన్నారు. రాజ్యాంగంలోని 164 (1బి) అధికరణకు ఇది విరుద్ధమని వాదించారు. మంత్రివర్గంలో ఎవరినైనా తీసుకునే హక్కు సిఎంకు ఉందని, కాని పార్టీ ఫిరాయించిన వారిని సిఎం సిఫార్సు చేస్తే, వారిని గవర్నర్ మంత్రులుగా నామినేట్ చేశారని, ఇదంతా రాజ్యాంగ విరుద్ధమని వాదించారు. ఈ సందర్భంగా ఏపి ప్రభుత్వ అడ్వకేట్ జనరల్ డి రమేష్ తెలంగాణ ప్రభుత్వం కూడా టిడిపి ఎమ్మెల్యే తలసాని శ్రీనివాసయాదవ్‌ను మంత్రిగా నియమించారనే పిటిషన్‌ను 2015లో దాఖలు చేశారని కోర్టుకు వివరించారు. దీంతో కోర్టు జోక్యం చేసుకుని పార్టీని ఫిరాయించిన కేసులన్నింటికీ ఒకేసారి విచారిస్తామని స్పష్టం చేసింది.