రాష్ట్రీయం

శ్రీవారి ఆలయం పోటులో మంటలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, సెప్టెంబర్ 2: శ్రీవారి లడ్డూప్రసాదాలు తయారు చేసేందుకు ఆలయం వెలుపల ఏర్పాటు చేసిన పోటు (వంటశాల)లో శనివారం మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన పోటు సిబ్బంది వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. దీంతో అక్కడకు చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపుచేశారు. పోటులో అగ్నిప్రమాదం జరిగిందని, తీవ్ర నష్టం జరిగిందని ప్రచారం సాగింది. దీంతో ఆలయ డిప్యూటి ఇ ఓ కోదండరామారావు విలేఖరులతో మాట్లాడుతూ పోటలో అగ్నిప్రమాదం జరగలేదని స్పష్టం చేశారు. వాస్తవానికి లడ్డూ తయారీ కోసం అవసరమైన బూందీని తయారుచేసే సమయంలో అప్పుడప్పుడు వేడి సెగలు పైకిలేస్తాయని అన్నారు. ఆ సమయంలో సెగలు చినీని తాకినప్పుడు, చినీకి అంటుకుని ఉన్న నెయ్యి వ్యర్థం మండుతుందన్నారు. అదే జరిగిందని అగ్నిప్రమాదం కాదన్నారు.