రాష్ట్రీయం
వీడ్కోలు వినాయకా
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Wednesday, 6 September 2017
గణపతి బప్పా మోరియా అన్న నినాదంతో జంటనగరాలు మార్మోగాయి. రెండు నగరాల నలు చెరగులా వెలసిన గణనాథుల నిమజ్జనోత్సవానికి భక్తులు వేల సంఖ్యలో హాజరై వీడ్కోలు పలికారు. పదకొండు రోజుల పాటు నిత్య నీరాజనాలు, పూజలను అందుకున్న వినాయక విగ్రహాలను భక్తిపారవశ్యంతో, నినాదాలతో నిమజ్జనానికి తరలించారు. ఈ సందర్భంగా అంతటా భారీ ఎత్తున భద్రతా ఏర్పాట్లు చేశారు. హైదరాబాద్లో అతి పెద్ద విగ్రహమైన ఖైరతాబాద్ వినాయకుడిని మామూలుగా కాకుండా మంగళవారం మధ్యాహ్నమే హుస్సేన్ సాగర్లో నిమజ్జనం చేశారు. గతంలో అన్ని విగ్రహాల కంటే చివరిగా ఖైరతాబాద్ వినాయకుడి నిమజ్జనం జరిగేది. భక్తి ముక్తులను మేళవిస్తూ సాగిన పదకొండు రోజుల చవితి ఉత్సవాలు అంతే ఉత్సాహంగా శాంతియుత వాతావరణంలో ముగిశాయి.