రాష్ట్రీయం

9 మంది ఉపాధ్యాయులకు జాతీయ అవార్డులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబరు 5: జాతీయ ఉత్తమ ఉపాధ్యాయులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి తొమ్మిది మంది అవార్డులను అందుకున్నారు. ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం నాడు విజ్ఞాన్ భవన్‌లో జరిగిన కార్యక్రమంలో ఉపరాష్టప్రతి వెంకయ్యనాయుడు దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాలకు చెందిన ఉపాధ్యాయులకు ఈ అవార్డులను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి ప్రకాశ్ జవడేకర్, సహాయమంత్రులు సత్యపాల్, ఉపేంద్ర కుష్వాహ కూడా పాల్గొన్నారు. అవార్డులు అందుకున్న వారిలో గుంటూరు జిల్లా కాకుమానుకు చెందిన గోరంట్ల శ్రీనివాసరావు, మనుకొండవారిపాలెంకు చెందిన చాగంటి శ్రీనివాసరావు, పాములపాడుకు చెందిన నల్లబోయిన విమలకుమారి, తూర్పు గోదావరి జిల్లా కడియంకు చెందిన చిలుకూరి శ్రీనివాసరావు,విశాఖ జిల్లా మారేడుపూడికి చెందిన ఎర్ర చక్రవర్తి, యెండాడ చెందిన గొట్టేటి రవి, విజయనగరం జిల్లా గజపతినగరానికి చెందిన బొట్లకోటి శంకరరావు,పశ్చిమ గోదావరి జిల్లా చాగల్లుకు చెందిన ధర్మరాజు, తేజంపూడికి చెందిన రెడ్డి లోకనాథరెడ్డి ఉన్నారు.