రాష్ట్రీయం
గవర్నర్ను కలిసిన ఏపి స్పీకర్ కోడెల
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Thursday, 7 September 2017
హైదరాబాద్, సెప్టెంబర్ 7: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల గవర్నర్ ఇఎస్ఎల్ నరసింహన్ను ఎపి శాసనసభ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాద్ గురువారం కలిశారు. నరసింహన్ కాలుకు చిన్న శస్త్ర చికిత్స జరగడంతో మర్యాద పూర్వకంగా కోడెల కలిశారని అధికార వర్గాలు వెల్లడించాయి. గవర్నర్ త్వరగా కోలుకోవాలని ఎపి ప్రజలంతా కోరుతున్నారని ఈ సందర్భంగా కోడెల పేర్కొన్నారు. ప్రజలందరి తరఫున నరసింహన్కు పుష్పగుచ్చం అందించి ‘్భగవంతుడు మీకు పూర్తి ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరుతున్నాన’ని ఈ సందర్భంగా స్పీకర్ పేర్కొన్నారు.