రాష్ట్రీయం

గ్రామీణ యువతి మిసెస్ ఇండియా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పరకాల, సెప్టెంబర్ 9: మిసెస్ ఇండియా బ్యూటీక్వీన్ కిరీటం తెలంగాణలోని జయశంకర్ జిల్లా చిట్యాల మండలం జడలపేటకు చెందిన కొట్టె స్నేహ సాధించింది. రాజస్థాన్‌లోని జైపూర్ క్రోనేప్లాజాలో నిర్వహించిన పోటీలో మిసెస్ క్వీన్ ఇండియాగా తెలంగాణ నుంచి స్నేహ ఒక్కరే పాల్గొన్నారు. అన్ని రౌండ్లలో సత్తా చాటి మిసెస్ ఇండి యా బ్యూటీక్వీన్ 2017 కిరీటాన్ని సొంతం చేసుకుంది. వోవ్ వ్యవస్థాపకులు బీరేకాల్ దిల్లీయన్, రోసేఖర్జా వేదికపైన ఆమెకు కిరీటాన్ని అలంక రించారు. ప్రభాకర్‌రావు, రాణిల మొదటి సంతానంగా జన్మించిన స్నేహ బిటెక్ పూర్తి చేసింది. ప్రస్తుతం హైదరాబాద్‌లోని ఓపెన్ టెక్ట్స్ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తోంది. స్నేహ భర్త శ్రీ్ధర్ హైదరాబాద్‌లోని బిడిఎల్ రక్షణ శాఖ కార్యాలయంలో సీనియర్ మాస్టర్ టెక్నీషియన్‌గా పనిచేస్తున్నారు.