రాష్ట్రీయం

పిడుగుపాటుకు ఇద్దరు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సత్యవేడు, సెప్టెంబర్ 10: ఆరుబయట ఆడుకుంటున్న ఇద్దరు చిన్నారులు పిడుగుపాటుకు మృతి చెందిన సంఘటన చిత్తూరు జిల్లా సత్యవేడు మండల పరిధిలోని చిన్న ఈటిపాకం గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. చిన్న ఈటిపాకం గ్రామ శివార్లలోని పంట పొలాల్లో చిన్నారులు సరదాగా ఆడుకుంటున్న సమయంలో వర్షం రావడంతో ఓ చెట్టు కిందకు వెళ్లారు. ఒక్కసారిగా చెట్టుపై పిడుగు పడటంతో చెట్టు కిందే ఉన్న విమల్‌రాజు (14), మహేష్ (14)కు తీవ్రగాయాలై అపస్మారక స్థితిలోకి వెళ్లారు. వీరిని గమనించిన గ్రామస్థులు హుటాహుటిన సత్యవేడు ప్రభుత్వాసుపత్రికి తరలించే క్రమంలో మార్గమధ్యంలోనే మృతి చెందారు. సరదాగా పిల్లలు ఆడుకుంటున్న సమయంలో పిడుగుపాటుకు బలైపోవడంతో వారి కుటుంబాల్లో విషాదఛాయలు అలముకున్నాయి. దీనిపై సత్యవేడు ఎస్‌ఐ కేసు నమోదు చేశారు.