రాష్ట్రీయం

వృద్ధిలో ఏపీ పరుగు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, సెప్టెంబర్ 15: 2017-18 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో ఆంధ్రప్రదేశ్ 11.72 శాతం వృద్ధిరేటు నమోదు చేసింది. జాతీయ వృద్ధిరేటు కంటే రెట్టింపుగా ఉండటం విశేషం. జాతీయస్థాయిలో తొలి త్రైమాసిక వృద్ధిరేటు 5.6 శాతంగా ఉంది. గడచిన 3 మాసాలకుగాను దేశంలో అత్యధిక వృద్ధిరేటు సాధించిన రాష్ట్రాల్లో ఆంధ్ర రెండో స్థానంలో నిలిచింది. మధ్యప్రదేశ్ మొదటి స్థానంలో ఉండగా, బీహార్, తెలంగాణ, మహారాష్ట్ర తొలి ఐదు రాష్ట్రాల్లో చోటు సాధించాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు శుక్రవారం నిర్వహించిన శాఖాధిపతులతో రాష్ట్భ్రావృద్ధి, వివిధ రంగాల్లో సాధించిన వృద్ధి రేటుపై సమీక్ష నిర్వహించారు. తొలి త్రైమాసికంలో ప్రాథమిక రంగంలో 27.6 శాతం, పరిశ్రమ రంగంలో 8.05, సేవా రంగంలో 8.67 శాతం వృద్ధి నమోదైంది. 2011-12 ధరల ప్రకారం ఈ ఆర్ధిక సంవత్సరం తొలి త్రైమాసికంలో మూడు రంగాల్లో కలిపి జీవిఏ రూ.1,19,652 కోట్లుగా ఉంది. ఇందులో వ్యవసాయ, అనుబంధ రంగాల్లో రూ.23.374 కోట్లు, పరిశ్రమల రంగంలో రూ.34,599 కోట్లు, సేవా రంగంలో రూ.61,679 కోట్లుగా ఉంది. ప్రాథమిక రంగంలో ఆకట్టుకునే వృద్ధి నమోదు అవడంతో ఈ ఫలితాలు సాధ్యమయ్యాయి. ప్రాథమిక రంగంలో ప్రధానంగా వ్యవసాయ రంగంలో
అద్భుతమైన వృద్ధి రేటు కనిపించింది. వ్యవసాయ రంగంలో నమోదైన 27.60 శాతం వృద్ధిరేటులో మత్స్యశాఖ, పశు సంవర్థకశాఖ ప్రధాన భూమిక వహించాయి. మత్స్యశాఖ 42.09 శాతం, పశు సంవర్థకశాఖ 14.69 శాతం వృద్ధిని కనబర్చాయి.
పరిశ్రమ రంగంలో తొలి త్రైమాసికంలో 14.65 శాతం వృద్ధిరేటు సాధించాలని లక్ష్యంగా పెట్టుకోగా, 8.05 శాతం మాత్రమే వృద్ధి నమోదైంది. వీటిలో ప్రధానంగా మైనింగ్, క్వారీయింగ్ పరిశ్రమల్లో 8.2 శాతం, తయారీ రంగంలో 8.83 శాతం, విద్యుత్, గ్యాస్, నీటి సరఫరా రంగాల్లో 11.94 శాతం, నిర్మాణ రంగంలో 5.67 శాతం, పరిశ్రమ రంగంలో 8.05 శాతం వృద్ధి నమోదైంది. సేవా రంగంలో తొలి త్రైమాసికంలో 13.90 శాతం లక్ష్యంగా నిర్దేశించుకోగా, 8.67 శాతం వృద్ధి నమోదైంది. ఇందులో ట్రేడ్, హెచ్ అండ్ ఆర్ రంగంలో 11.08 శాతం, రవాణా, నిల్వ రంగంలో 9.04 శాతం, ఆర్థిక సేవల్లో 9.54 శాతం, రియల్ ఎస్టేట్, నివాస రంగాల్లో 5.3 శాతం, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్‌లో 8.16 శాతం, ఇతర సేవల్లో 9.24 శాతం వృద్ధి నమోదైంది.
ఇవీ లక్ష్యాలు..
జీవిఏలో 74 శాతం వాటాగా ఉన్న 9 రంగాలను గ్రోత్ ఇంజన్లుగా గుర్తించి తగు లక్ష్యాలను నిర్దేశించారు. పశుసంవర్థక శాఖలో రూ.72వేల కోట్లు, తయారీ రంగంలో రూ.67వేల కోట్లు, ఉద్యాన శాఖలో రూ.62వేల కోట్లు, నిర్మాణ రంగంలో రూ.62వేల కోట్లు, వర్తకం, మరమ్మతులు, హోటళ్లు, రెస్టారెంట్ల రంగంలో రూ.61వేల కోట్లు, మత్స్య, సముద్ర ఉత్పత్తుల రంగంలో రూ.60వేల కోట్లు, రవాణా, నిల్వ రంగంలో రూ.60వేల కోట్లు, వ్యవసాయ రంగంలో రూ.56వేల కోట్లు, రియల్ ఎస్టేట్, నివాస రంగాల్లో రూ.71వేల కోట్లు చొప్పున జీవిఏ సాధించాలని లక్ష్యాన్ని నిర్దేశించారు. కృష్ణాజిల్లా జక్కంపూడిలో జెట్ సిటీ పేరుతో ఆర్థిక నగరం ఏర్పాటుకు ఈ ఏడాది శ్రీకారం చుట్టారు. 265 ఎకరాల్లో నెలకొల్పుతున్న భారీ ప్రాజెక్టులో ఆర్థిక కార్యకలాపాల కోసం 2.5 మిలియన్ చదరపు అడుగులు, వ్యాపార, వాణిజ్య కార్యకలాపాల కోసం 2 మిలియన్ చదరపు అడుగుల మేర నిర్మాణాలు చేపడతారు.

చిత్రం..వివిధ రంగాల్లో వృద్ధిరేటుపై శాఖాధిపతులతో సమీక్షిస్తున్న సిఎం చంద్రబాబు