రాష్ట్రీయం

‘ప్రజా పంపిణీలో అక్రమాలకు అడ్డుకట్ట’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 17: ఆధునిక విజ్ఞానాన్ని తెలంగాణ ప్రజా పంపిణీ వ్యవస్థ పూర్తిగా వినియోగించుకుంటోదని, దాంతో సత్ఫలితాలు వస్తున్నాయని పౌరసరఫరాల కమిషనర్ సి.వి. ఆనందర్ పేర్కొన్నారు. వినియోగదారులు ఫోరం దక్షిణాది రాష్ట్రాల రెండురోజుల సమావేశంలో భాగంగా ఆదివారం హైదరాబాద్‌లో జరిగిన ముగింపు కార్యక్రమంలో పవర్‌పాయింట్ ప్రెసెంటేషన్ చేస్తూ, అక్రమాలకు అడ్డుకట్టవేయడంతో ఈ వ్యవస్థను ప్రజలకు మరింతచేరువుగా తీసుకువెళ్లామన్నారు. ప్రత్యేకంగా టి-రేషన్ మొబైల్ యాప్‌ను ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చామన్నారు. ఈ యాప్ ద్వారా రేషన్ లావాదేవీలు సామాన్యప్రజలు కూడా నేరుగా తెలుసుకునేందుకు వీలవుతోందన్నారు. జాతీయ ఆహార భద్రత కార్డుల ద్వారా కేంద్రప్రభుత్వం ఒక్కో వ్యక్తికి నెలకు కిలో మూడురూపాయల చొప్పున ఐదుకిలోల బియ్యం ఇస్తుండగా, తెలంగాణ ప్రభుత్వం ఒక్కొక్క వ్యక్తికి కిలో ఒకరూపాయి చొప్పున ఆరు కిలోల బియ్యం ఇస్తోందన్నారు. దీనివల్ల రాష్ట్రంలో 2.75 కోట్ల మంది లబ్దిపొందుతున్నారని వివరించారు.