రాష్ట్రీయం

తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, సెప్టెంబర్ 17: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో 3.1 కిలోమీటర్ల ఎత్తున ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని విశాఖ వాతావరణ పరిశోధన కేంద్రం అధికారులు ఆదివారం రాత్రి తెలిపారు. దీని ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో రాగల 24 గంటల్లో ఒక మోస్తరు నుంచి పలు చోట్ల సాధారణ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.
కోస్తాంధ్రలో ఒకటి, రెండు చోట్ల భారీ వర్షాలు కురుస్తాయన్నారు. శనివారం ఉదయం నుంచి ఆదివారం ఉదయం వరకూ రాష్ట్రంలో పలు చోట్ల విస్తారంగా వర్షాలు కురిశాయని తెలిపారు. పోలవరంలో అత్యధికంగా 13 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కాగా, దవళేశ్వరం, పార్వతీపురం, మెరకముడిదాం, గరుగుబిల్లి, నెల్లూరులో 8 సెంమీ, రావూరు, యలమంచిలి, తెర్లాం, ఆత్మకూరులో 6 సెంమీ, రాజమండ్రి, గంట్యాడలో 5 సెంమీ వర్షపాతం నమోదైంది.