రాష్ట్రీయం

2న లక్ష గృహ ప్రవేశాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, సెప్టెంబర్ 26: రాష్ట్రంలో అక్టోబర్ 2న ప్రపంచ ఆవాస దినం, గాంధీ జయంతి సందర్భంగా ప్రభుత్వం పేదల కోసం నిర్మించిన లక్ష ఇళ్లను ప్రారంభోత్సవం చేయనున్నట్లు సమాచార, పౌర సంబంధాల శాఖ, గ్రామీణ గృహ నిర్మాణ శాఖ మంత్రి కాలవ శ్రీనివాసులు వెల్లడించారు. వెలగపూడి సచివాలయం 4వ బ్లాక్ మొదటి అంతస్తులోని తన చాంబర్‌లో సోమవారం ఏపి గృహ నిర్మాణ సంస్థ చైర్మన్ వర్ల రామయ్య, గ్రామీణ గృహ నిర్మాణ శాఖ అధికారులతో మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి కాలవ మాట్లాడుతూ రూ. 16 వేల కోట్లతో 10 లక్షల ఇళ్ల నిర్మాణం చేపట్టడం ప్రభుత్వ లక్ష్యమన్నారు. పూర్తి పారదర్శకంగా ఇళ్లు నిర్మిస్తున్నట్లు తెలిపారు. గృహ ప్రవేశాల సందర్భంగా ప్రతి ఇంటి వద్ద రెండు మొక్కల చొప్పున రెండు లక్షల మొక్కలు నాటే ఏర్పాటు చేయాలన్నారు. లబ్ధిదారులు కోరిన మొక్కలు ఇవ్వాలని చెప్పారు. 11 వందలకు పైగా గ్రామ పంచాయతీలకు, 30 మున్సిపాల్టీలలోని వార్డులకు మొదటి దశలో ఇళ్లు మంజూరు చేసినట్లు అధికారులు తెలపారు. ప్రస్తుతం 9,835 గ్రామ పంచాయతీల్లో, 884 వార్డుల్లో లక్షకు పైగా గృహాల నిర్మాణం పూర్తి అయినట్లు వివరించారు. గృహ నిర్మాణ సంస్థ చైర్మన్ వర్ల రామయ్య మాట్లాడుతూ గుడిసె లేని సమాజం ఈ ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఇంటింటికి మొక్కలు సరఫరా చేసే బాధ్యత కూడా మీరే తీసుకోవాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఇళ్ల ప్రారంభోత్సవాల సందర్భంగా పండుగ వాతావరణ నెలకొనే విధంగా మామిడి ఆకుల తోరణాలు కట్టించడంతోపాటు అందుబాటులో ఉన్న చోట అరటి బాదులు ఏర్పాటు చేయాలన్నారు. ఏఈల ద్వారా సాధ్యమైనన్ని ఎక్కువ గృహ ప్రవేశ ఫొటోలు అప్‌లోడ్ చేయించాలన్నారు.

చిత్రం..అధికారులతో సమీక్షిస్తున్న మంత్రి కాలవ శ్రీనివాసులు