రాష్ట్రీయం

48 గంటల్లో అల్పపీడనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, అక్టోబర్ 14: నైరుతి బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు శనివారం రాత్రి తెలిపారు. ఇది క్రమమేపీ బలపడి రాగల 48 గంటల్లో మధ్య బంగాళాఖాతం, పరిసరాల్లో అల్పపీడనంగా మారే అవకాశం ఉందన్నారు. అల్పపీడనం కూడా బలపడి ఈ నెల 19 నాటికి వాయుగుండంగా
బలపడవచ్చని అంచనావేస్తున్నారు. దీనికి తోడు రాయలసీమ ప్రాంతంలో 0.9 కిమీ ఎత్తున మరో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని వాతావరణ శాఖ పేర్కొంది. ఆవర్తనాల ప్రభావంతో రాగల 24 గంటల్లో కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ఒకటి,రెండు చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు. శుక్రవారం ఉదయం నుంచి శనివారం ఉదయం వరకూ కూనవరం, వరరామచంద్రపురంలో 7 సెంటీమీటర్లు, వేలేరుపాడు, చింతపల్లిలో 5 సెంమీ వర్షపాతం నమోదైంది.