రాష్ట్రీయం

దీపావళికి నాలుగు ప్రత్యేక రైళ్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 14: దీపావళి పండుగ రద్దీని దృష్టిలో ఉంచుకుని నాలుగు ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. కాచిగూడ-కాకినాడ పోర్టు-కాచిగూడ మధ్య రెండు సర్వీసులు నడుపుతున్నట్లు తెలిపింది. ఈ నెల 18న సాయంత్రం 6.45 గంటలకు కాచిగూడ నుంచి ప్రత్యేక రైలు బయలుదేరుతుండగా, తిరుగు ప్రయాణంలో ఈనెల 22న సాయంత్రం 5.10 గంటలకు కాకినాడ నుంచి బయలుదేరుతుంది. అలాగే సికింద్రాబాద్-చెన్నై సెంట్రల్-సికింద్రాబాద్ మధ్య రెండు సర్వీసులు నడుపుతున్నట్లు తెలిపింది. ఈ నెల 23న సికింద్రాబాద్ నుంచి సాయంత్రం 7.15 గంటలకు ప్రత్యేక రైలు బయలుదేరుతుండగా, తిరుగు ప్రయాణంలో ఈ నల 23న చెన్నై సెంట్రల్ నుంచి మధ్యాహ్నాం 2.30 గంటలకు బయలుదేరుతుందని తెలిపింది. ప్రయాణీకులు ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని రైల్వే కోరింది.