రాష్ట్రీయం

స్థిరంగా అల్పపీడనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, అక్టోబర్ 15: మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం స్థిరంగా కొనసాగుతోందని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు ఆదివారం రాత్రి వెల్లడించా రు. అల్పపీడనం అతి నెమ్మదిగా బలపడుతోందని, మరో రెండు రోజులకు వాయుగుండంగా మారే అవకాశం ఉందన్నారు. ఇది మరింత బలపడి తీవ్ర వాయుగుండంగా మారే అవకాశాలపై స్పష్టత లేదన్నారు. వాయుగుండం ఉత్తరాంధ్ర, ఒడిశాల వైపు పయనించి తీరం దాటే అవకాశం ఉందన్నారు. దీని ప్రభావంతో రాగల 24 గంటల్లో కోస్తాంధ్ర అంతటా ఒక మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు. ఒకటి, రెండుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం లేకపోలేదన్నారు. అలాగే తీరం వెంబడి గంటకు 25 నుంచి 30 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయన్నారు. ఇక తెలంగాణను ఆనుకుని ఒక ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని, దీని ప్రభావంతో తెలంగాణ, రాయలసీమ జిల్లాల్లో చెదురుమదురు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. శనివారం ఉదయం నుంచి ఆదివారం ఉదయం వరకూ కోస్తాలో కైకలూరులో 3 సెంమీ, రాయలసీమకు సంబంధించి నందికొట్కూరు, కునురుపిలో 7 సెంమీ, సెట్టూరులో 6 సెంమీ వర్షపాతం నమోదైందని తెలిపారు.