రాష్ట్రీయం

31న కొలువుల కొట్లాట నిర్వహిస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 28: ‘కొలువుల కొట్లాట’ పేరిట 31న నిరుద్యోగులు, విద్యార్థులతో బహిరంగ సభ నిర్వహించి తీరుతామని టి.జెఎసి చైర్మన్ ప్రొఫెసర్ ఎం. కోదండరామ్ తెలిపారు. ఉద్యోగ నియామకాలకు సంబంధించిన క్యాలెండర్ ప్రకటించాలని డిమాండ్ చేస్తూ గతంలోనూ కోదండరామ్ నిర్వహించాలనుకున్న సభను పోలీసులు భగ్నం చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ దఫా ముందుగానే నిజాం కళాశాల, సరూర్‌నగర్ స్పోర్ట్ కళాశాల, ఉప్పల్‌లో ప్రైవేటు గ్రౌండ్, ఎన్టీఆర్ స్టేడియంలో ఏదైనా ఒక్క దానిలో సభ నిర్వహించుకోవడానికి అనుమతి ఇవ్వాలని కోరినట్లు చెప్పారు. సభకు అనుమతి లభిస్తుందన్న నమ్మకంతో ఉన్నామన్నారు. తమ సభకు అనుమతి ఇవ్వరాదని పోలీసులు ముందుగానే వివిధ ఫంక్షన్ హాళ్ళ యజమానులను, ప్రైవేటు ఖాళీ స్థలాల యజమానులను బెదిరిస్తున్నారని అన్నారు. నల్లగొండలో అమర వీరుల స్పూర్తి యాత్రకు సంబంధించి కోర్టులో కేసు వేశామని, నల్లగొండ, సూర్యాపేట ఎస్పీలు యాత్రకు అనుమతి లేదనడాన్ని కోర్టు కొట్టి వేసిందని చెప్పారు. ఆ జిల్లాలో యాత్ర కోసం మళ్లీ పోలీసులకు దరఖాస్తు చేసుకోవాల్సిందిగా కోర్టు సూచించిందని తెలిపారు.