రాష్ట్రీయం

గోదావరి నదిలో ముగ్గురి గల్లంతు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భద్రాచలం టౌన్, నవంబర్ 2: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం పట్టణ సరిహద్దున ఉన్న ఆంధ్రప్రదేశ్‌లోని యటపాక మండలంలో గోదావరి నదిలో ముగ్గురు గల్లంతయ్యారు. భద్రాచలం పట్టణానికి చెందిన బుద్దుల అరుణకుమారి(26), ఆమె సోదరుడు రాంప్రసాద్(22), మడకం రాణి(16), మరో ఐదుగురు దుస్తులు ఉతుక్కునేందుకు గోదావరి నదిలోకి వెళ్లారు. ప్రమాదవశాత్తూ మడకం రాణి నదిలో మునిగిపోగా ఆమెను రక్షించే ప్రయత్నంలో అక్క, తమ్ముడు కూడా నదిలో కొట్టుకుపోయారు. వీరి ఆచూకీ కోసం పోలీసులు గజ ఈతగాళ్ల సహాయంతో చర్యలు చేపట్టారు. గురువారం రాత్రి వరకు వీరి ఆచూకీ లభ్యం కాలేదు.