రాష్ట్రీయం

పాదయాత్రకు ఒక రోజు బ్రేక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 10: వైకాపా అధ్యక్షుడు, ఆంధ్ర అసెంబ్లీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి శుక్రవారం ఇక్కడ సిబిఐ ప్రత్యేక కోర్టుకు విచారణ నిమిత్తం హాజరయ్యారు. అక్రమాస్తుల కేసులో జగన్ పలు అభియోగాలు ఎదుర్కొంటున్న విషయం విదితమే. కేసులో కోర్టుకు హాజరుకాకుండా వ్యక్తిగతంగా మినహాయింపు ఇవ్వాలని గతంలో జగన్ పెట్టుకున్న అభ్యర్ధనను సిబిఐ కోర్టు అనుమతించలేదు. ఈ నేపథ్యంలో ఈనెల 6న ఇడుపులపాయ నుంచి ప్రజా సంకల్ప యాత్ర పేరిట పాదయాత్ర చేపట్టిన జగన్ యాత్రకు విరామం ఇచ్చి కోర్టుకు హాజరయ్యారు. ఈ కేసులో కోర్టు ఎదుట ఎంపి వైవి సుబ్బారెడ్డి, మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఇండియా సిమెంట్స్ అధినేత శ్రీనివాసన్ హాజరయ్యారు.