రాష్ట్రీయం

15న కృష్ణా బోర్డు త్రిసభ్య కమిటీ భేటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 10: నాగార్జునసాగర్, శ్రీశైలం ప్రాజెక్టులలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు జరిగిన 66:34 నిష్పత్తి మేరకు ఇరు రాష్ట్రాలకు నెలవారీగా నీటి వాటాలను ఖరారు చేయడానికి కృష్ణా బోర్డు త్రిసభ్య కమిటీ ఈ నెల 15న హైదరాబాద్‌లో సమావేశం కానుంది. జలసౌధలో ఆ రోజు మధ్యాహ్నం 3 గంటలకు జరిగే సమావేశానికి హాజరు కావాల్సిందిగా కృష్ణా బోర్డు శుక్రవారం ఇరు రాష్ట్రాలకు లేఖలు రాసింది. ఈ సమావేశానికి తెలంగాణ ఇంజనీరింగ్ ఇన్ చీఫ్ మురళీధర్, ఎపి ఇంజనీరింగ్ ఇన్ చీఫ్ వెంకటేశ్వర్‌రావు, బోర్డు సభ్య కార్యదర్శులు హాజరు కానున్నారు.