రాష్ట్రీయం
కళ్లు చెదిరేలా విశాఖ కనె్వన్షన్
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
విజయవాడ, నవంబర్ 11: కేరళలోని కొచ్చిలో నిర్మించిన కనె్వన్షన్ సెంటర్కంటే విశాఖలో నిర్మించనున్న సెంటర్, మాల్ గొప్పగా ఉండాలని లులు గ్రూపు ప్రతినిధులకు సిఎం చంద్రబాబు సూచించారు. కొచ్చిలో అత్యాధునిక వసతి సౌకర్యాలతో లులు గ్రూపు నిర్మించిన కనె్వన్షన్ సెంటర్, మాల్లను శనివారం సందర్శించారు. 10 వేల మంది సీటింగ్ సామర్థ్యంతో ఏర్పాటు చేసిన కనె్వన్షన్ సెంటర్ను, 250 గదులు, 2.2 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన మాల్ను పరిశీలించారు. విశాఖలో ఆ గ్రూపు నిర్మించనున్న సెంటర్ దీనికంటే మెరుగ్గా ఉండాలని కోరారు. విశాఖలో నిర్మించే సెంటర్కు సముద్ర తీరం అదనపు ఆకర్షణ కానుందని సిఎం అన్నారు. ఇప్పటికే బిడ్డింగ్ ప్రక్రియ పూర్తి అయినందున, వేగంగా నిర్మాణాలు పూర్తి చేయాలని కోరారు.
చిత్రం..కొచ్చిలోని లులు మాల్ను సందర్శిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు