రాష్ట్రీయం

‘హబ్బో’ అనిపించేలా..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 12: హైదరాబాద్‌కే పరిమితమైన ఐటి రంగం తెలంగాణ జిల్లా కేంద్రాలకూ విస్తరిస్తోంది. ప్రస్తుతం సైబరాబాద్ హైటెక్ సిటీలో కేంద్రీకృతమైవున్న ఐటీ కంపెనీలు, ప్రభుత్వ ప్రోత్సాహంతో జిల్లా కేంద్రాల్లోకూ విస్తరించేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నాయి. ఐటీ అంటే మాదాపూర్, మణికొండ, గచ్ఛిబౌలి కలయికతోవున్న సైబరాబాద్ గుర్తుకొస్తుంది. ప్రతి జిల్లా శివార్లకు ఒక సైబరాబాద్ వచ్చేలా కేటీఆర్ ఆధ్వర్యంలో ఐటీ శాఖ చురుకుగా పావులు కదుపుతోంది. రాష్ట్రంలో టూ టైర్ సిటీల్లో ఐటీ కంపెనీలను నెలకొల్పాలని మంత్రి కె తారకరామారవు గత మూడేళ్లుగా చేస్తోన్న ప్రయత్నాలు ఫలిస్తున్నాయి. దాదాపు60కి పైగా ఎన్‌ఆర్‌ఐ పారిశ్రామికవేత్తలు నిజామాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్ జిల్లా కేంద్రాల్లో రూ.25 కోట్ల చొప్పున ఐటీ హబ్‌లను ఏర్పాటు చేసేందుకు ఉత్సాహం చూపుతున్నారు. మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాల్లో పారిశ్రామిక, ఐటీ సమ్మిళిత పార్కులు ఏర్పాటుచేసి సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుడుతున్నామని ఐటీ శాఖ కార్యదర్శి జయేష్ రంజన్ వెల్లడించారు. ఖమ్మం జిల్లా కేంద్రంలో ఇప్పటికే ఐటీ హబ్ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. నిజామాబాద్‌లో ఐటీ హబ్ ఏర్పాటుకు ప్రభుత్వం
సూత్రప్రాయంగా అనుమతులిచ్చింది. ఇప్పటికే కరీంనగర్ ఐటీ హబ్‌కు డిజైన్ ఖరారైంది. ఖమ్మం జిల్లాలో ఐటీ హబ్ ఏర్పాటుకు 14మంది పారిశ్రామికవేత్తలు పోటీపడ్డారు.
రాష్ట్ర ప్రభుత్వం ఐటీ పరిశ్రమలు నెలకొల్పేందుకు ముందుకొచ్చే పారిశ్రామికవేత్తలకు ప్రోత్సహకాలు ఇస్తోంది. 25వేల చదరపు అడుగుల భవనాన్ని నిర్మించి, 2వేల మందికి ఉద్యోగం కల్పిస్తే రూ.25 కోట్ల వరకు ప్రోత్సాహకాలు ఇస్తామని ప్రకటించింది. ఐటీ హబ్‌లలో ఇంక్యుబేషన్ సెంటర్లు, స్టార్టప్‌లను నెలకొల్పి వీటిని టి-హబ్‌తో అనుసంధానిస్తారు.
హైదరాబాద్ హెటెక్ సిటీలో ప్రస్తుతం 1400కు పైగా ఐటీ కంపెనీలు ఉన్నాయి. ఇక్కడ 3.5 లక్షల మందికి పైగా పని చేస్తున్నారు. దీర్ఘకాలిక వ్యూహంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతి జిల్లా కేంద్రం చుట్టూ ఔటర్ రింగ్ రోడ్డు నిర్మిస్తోంది. హైదరాబాద్ చుట్టూ ఔటర్‌రింగ్ రోడ్డు నిర్మాణమైంది. హైదరాబాద్ పరిసరాల్లో ఐదారు జిల్లాలను కలుపుతూ 290 కి.మీమేర రీజనల్ రింగ్ రోడ్డు నిర్మాణానికి హెచ్‌ఎండిఏ ప్రణాళిక ఖరారు చేసింది. తెలంగాణ నైసర్గిక, భౌగోళిక స్వరూపం దృష్ట్యా హైదరాబాద్‌కు నిజామాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్ జిల్లాల నుంచి మూడు గంటల్లో చేరుకునే సదుపాయం ఉంది. అందుకే వ్యయ నియంత్రణలో భాగంగా ఐటి కంపెనీలు వౌలిక సదుపాయాలు కల్పిస్తే జిల్లా కేంద్రాల్లో సంస్థలను ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నాయని సిఐఐ తెలంగాణ అధ్యక్షుడు రాజన్న స్పష్టం చేశారు.
తెలంగాణ రూరల్ టక్నెలజీ సెంటర్స్ 2016 పాలసీ ఫలితంగా సియాంట్, ఎకలాట్ హెల్త్ సొల్యూషన్స్ సంస్థలు వరంగల్, కరీంనగర్ జిల్లాల్లో తమ కార్యకలాపాలను మొదలుపెట్టాయి. ఖమ్మంలో ఐటీ ఇంక్యుబేషన్ సెంటర్‌కు శంకుస్థాపన జరిగింది. అనేక కంపెనీలకు స్థల కేటాయింపు లేఖలు కూడా ఇచ్చారు. కర్నాటకలో బెంగళూరు, మహారాష్టల్రోని పూణె, ముంబయి, తమిళనాడు చెన్నైలోనే ఐటీ కంపెనీలు కేంద్రీకృతమయ్యాయి. కానీ తెలంగాణలో ఐటీ రంగ విస్తరణకు అనువైన ప్రాంతమని సిఐఐ సంస్థ తన నివేదికలో పేర్కొంది. వింటోజ్ సాఫ్ట్‌వేర్, కాకతీయ ఐటీ సొల్యూషన్స్ సంస్థలు వరంగల్ నుంచి కార్యకలాపాలను మొదలుపెట్టాయి. మండల కేంద్రాల్లో ఐటీ కంపెనీలను స్థాపిస్తే అదనంగా బెనిఫిట్లు ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. తెలంగాణ అకాడమి ఆఫ్ స్కిల్ అండ్ నాలెడ్జ్ సంస్థ (టాస్క్) ఇప్పటికే ఇంజనీరింగ్ విద్యార్థులకు శిక్షణ ఇచ్చేందుకు అనేక చర్యలు తీసుకుంటోంది. మెట్రో నగరాల్లో పెరుగుతున్న రద్దీ, మానవ వనరులకు కేటాయించే వ్యయం భారం కావడంతో ఐటీ కంపెనీల ధోరణిలో మార్పు వస్తోందని, ఈ కోణంలోనే ప్రతి జిల్లా కేంద్రంలో హైటెక్ సిటీ ఏర్పాటవుతుందని, ఇది మంచి పరిణామమని తెలంగాణ ఐటీ ఫోరం అధ్యక్షుడు సందీప్ మక్త్యాల చెప్పారు. కరీంనగర్‌లో ఐటీ హబ్ నిర్మాణానికి టెండర్ల ప్రక్రియ కూడా ఖరారు చేశారు. 10 రోజుల్లో ప్రక్రియ పూరె్తైన వెంటనే నిర్మాణాలను మొదలుపెట్టనున్నారు. మూడు ఐటీ టవర్లను మానేరు డ్యాంవద్ద నిర్మించనున్నట్లు ఐటీ శాఖ అధికారులు తెలిపారు.