రాష్ట్రీయం

నగర ద్వయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 27: ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న ప్రపంచ పారిశ్రామిక సదస్సు మంగళవారం హైటెక్స్‌లోని నోవాటెల్‌లో ప్రారంభం కానుంది. సాయంత్రం 4 గంటలకు ప్రధాని నరేంద్రమోదీ సదస్సును ప్రారంభిస్తారు. అమెరికా అధ్యక్షుడి సీనియర్ సలహాదారు ఇవాంక ట్రంప్, తెలంగాణ సిఎం కె చంద్రశేఖరరావు, గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్‌తో పాటు కేంద్ర రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్, కేంద్ర విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ పాల్గొంటున్నారు. ఇనె్వస్టర్లు, పారిశ్రామిక వేత్తలు, విజ్ఞానాధారిత ప్రధాన పరిశ్రమల ముఖ్య కార్యనిర్వాహణాధికారులు హాజరవుతున్నారు. ప్రపంచం నలుమూలల నుంచి 160 దేశాల ప్రతినిధులు హాజరవుతారు. అందులో దాదాపు 10 దేశాల నుంచి పూర్తిగా మహిళా బృందాలే రానున్నాయి. శిఖరాగ్ర సదస్సును నిర్వహించడంలో భారత ప్రభుత్వం పక్షాన నీతి ఆయోగ్ ముఖ్య పాత్ర పోషిస్తోంది. ప్రపంచంలోని ఉత్తమ ఔత్సాహిక పారిశ్రామికవేత్తలతో కలిసి పనిచేయడానికి, వారితో సమన్వయాన్ని ఏర్పరచుకోవడానికి భారతీయ స్టార్టప్‌లకు, ఇన్నోవేటర్లకు ఇది ఒక విశిష్టమైన అవకాశం అవుతుంది. శిఖరాగ్ర సదస్సు నిర్వహణకు తొలుత తెలంగాణ ప్రభుత్వం ముందుకు రావడంతో హైదరాబాద్ వేదికగా మారింది. మంగళవారం సాయంత్రం 4 గంటలకు మొదలయ్యే
ప్లీనరీలో మాట్లాడేది ముగ్గురే. ప్రధాని మోదీ ప్రసంగం తర్వాత తెలంగాణ సిఎం కె చంద్రశేఖరరావు మాట్లాడతారు. అనంతరం అమెరికా అధ్యక్షుడి సలహాదారు ఇవాంక ట్రంప్ మాట్లాడతారు. ముగ్గురి ప్రసంగాలు ముగిసిన వెంటనే ప్యానల్ చర్చ జరుగుతుంది. చర్చలో ఎమిరిటస్ విమానాలు, సిస్కొ సంస్థ ప్రతినిధులు పాల్గొంటారు. ఇందులో ఇంవాంక ట్రంప్‌తో పాటు ఎస్‌ఆర్‌ఎస్ ఏవియేషన్ ఎండి సిబొంగైల్ శంబో, కేంద్ర రక్షణ మంత్రి నిర్మల సీతారామన్, ఎస్‌ఇబి చైర్మన్ మార్కస్ వాలెన్‌బర్గ్ మాట్లాడతారు. ఇదిలావుంటే, రంగురంగుల చిత్రాలతో హైటెక్స్ ప్రపంచ సదస్సుకు ముస్తాబైంది. రోడ్లు, డివైడర్లు, పచ్చని చెట్లు కొత్త హంగులతో ఆహ్లాదంగా కనిపిస్తున్నాయి. పక్కనే ఉన్న మెట్రో వంతెనకు సైతం రంగులు వేయడంతో చూడచక్కగా కనువిందు చేస్తోంది. ఏర్పాట్లను చూస్తే ఇది హైదరాబాద్ నగరమేనా? అన్న అనుమానం కలిగేలా ఉన్నాయ. రోడ్డుకు ఇరువైపులా విద్యుద్దీపాల అలంకరణతో మరింత వనె్న తెచ్చారు. నగరంలో 26 హోటళ్లలో విదేశీ అతిథులకు బస ఏర్పాటు చేశారు. సోమవారం సాయంత్రానికి దాదాపు వెయ్యిమంది విదేశీ ప్రతినిధులు నగరానికి చేరుకున్నారు. మిగిలిన బృందం అమెరికా నుండి ప్రత్యేక విమానంలో రానుంది. తొలి రోజు ప్లీనరీ కేవలం రెండున్నర గంటలపాటు జరుగుతుంది. సాయంత్రం ఏడున్నరకు ముగుస్తుంది.
ఇవాంక బసపై సందిగ్ధత
ఇవాంక ట్రంప్ సదస్సుకు హాజరవుతున్న సందర్భంగా ఆమెకు హోటల్ వెస్టిన్‌లో బస ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేశారు. అయితే ఆమె వెస్టిన్‌లోనే ఉంటారా? లేదా వేరేచోట ఆమె బసకు ఏర్పాట్లు చేశారా? అన్నదానిపై అధికారులు స్పష్టత ఇవ్వడం లేదు. ఇవాంక పర్యటన గోప్యంగా ఉంటుందని మాత్రమే చెబుతున్నారు. కాగా ఇవాంక బస చేసేందుకు హోటల్ ట్రైడెంట్, మరో ప్రత్యామ్నాయంగా హోటల్ ఇనోటెల్‌ను కూడా పరిశీలించినట్టు తెలుస్తోంది. రెండు రోజుల పాటు గడిపిన అనంతరం ఇవాంక ట్రంప్ 29 రాత్రి తిరుగు ప్రయాణం అవుతారు. 28 ఉదయమే ఆమె హైదరాబాద్ చేరుకుంటారు. అక్కడి నుంచి ఆమె బస చేసే వెస్టిన్ హోటల్ (ఆఖరి నిమిషంలో మార్పు ఉంటే ట్రైడెంట్‌కు) చేరుకుంటారు. మధ్యాహ్నం వరకూ విశ్రాంతి తీసుకుని, సాయంత్రం 3 గంటలకు హెచ్‌ఐసిసికి చేరుతారు. సహచర బృందంతో సంభాషణలు అనంతరం సదస్సులో పాల్గొంటారు. ఏడు గంటల సమయంలో ఆమె హెచ్‌ఐసిసి నుంచి హోటల్‌కు చేరుకుని, అక్కడి నుండి 8 గంటలకు ఫలక్‌నుమా ప్యాలస్‌కు వెళ్తారు. రాత్రి 10.40 గంటల వరకూ అక్కడే గడుపుతారు. మరుసటి రోజు 29న ఉదయం జరిగే తొలి సదస్సులో ఆమె పాల్గొనేందుకు హెచ్‌ఐసిసికి వస్తారు. 11 గంటల నుంచి సాయంత్రం 5 వరకూ ప్రైవేటు కార్యక్రమాల్లో పాల్గొంటారు. అనంతరం హోటల్‌కు చేరుకుని తిరుగు ప్రయాణమవుతారు.
రికార్డు విందు
నరేంద్రమోదీ భారత ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఇంతవరకూ ఎన్నడూ ఇవ్వని అధికారిక విందు కార్యక్రమాన్ని హైదరాబాద్‌లో నిర్వహించబోతున్నారు. ఫలక్‌నుమా ప్యాలస్‌లో ఆయన ఇచ్చే విందుకు ఇవాంక ట్రంప్‌తో పాటు ఇద్దరు కేంద్ర మంత్రులు, రాష్ట్ర గవర్నర్, ముఖ్యమంత్రితో పాటు 150 మంది పారిశ్రామికవేత్తలు, పుర ప్రముఖులు హాజరు కాబోతున్నారు.
*
కలలే పండెను నిజముగ
అలలై ఉప్పొంగె గుండె ఆహ్లాదముతో
రైలది మెట్రో అయ్యెను
గోలే కొట్టును ఇవాంక గ్లోబల్ సమ్మిట్!