రాష్ట్రీయం

భగ్గుమన్న మల్లాది డ్రగ్స్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రేణిగుంట, నవంబర్ 29: చిత్తూరు జిల్లా రేణిగుంట మండలంలోని గాజుల మండ్యం పారిశ్రామికవాడలోని మల్లాది డ్రగ్స్ కంపెనీలోని ప్లాంట్-ఏలో బుధవారం మధ్యాహ్నం అగ్నిప్రమాదం సంభవించి కెమికల్ రేడియేటర్ పేలింది. నాలుగు అంతస్థుల భవనంలోని రెండవ అంతస్థులో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదం జరిగినప్పుడు ప్లాంట్‌లో ఎనిమిది మంది ఉన్నట్లు సమాచారం. వీరిలో నలుగురు గాయపడగా, ముగ్గురు పరిస్థితి విషమం కావడంతో వెంటనే వారిని చెన్నయ్‌లోని అపోలో ఆస్పత్రికి తరలించారు. స్వల్పంగా గాయపడ్డ మరొకరిని రేణిగుంట రోడ్డులోని నారాయణాద్రి అస్పత్రికి తరలించారు. మరో నలుగురు సిబ్బంది ఆచూకీ తెలియకపోవడంతో వారు మరణించి ఉంటారని భావిస్తున్నారు. ఈ ప్రమాదంలో ఎవరూ మరణించలేదని అధికారులు చెబుతున్నారు. అగ్ని మాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలు ఇతర ప్రాంతాలకు వ్యాపించకుండా చర్యలు చేపట్టారు.

చిత్రం..మల్లాది డ్రగ్స్ పరిశ్రమలో దట్టంగా అలుముకున్న పొగ