రాష్ట్రీయం
రచనలు ప్రజలకు మేలుచేయాలి: మంత్రి లక్ష్మారెడ్డి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Monday, 18 December 2017
హైదరాబాద్, డిసెంబర్ 17: రచనలు ప్రజలకు మేలు చేసేలా ఉండాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ సి.లక్ష్మారెడ్డి అన్నారు. ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియం అలిశెట్టి ప్రభాకర్ ప్రాంగణంలో ఆదివారం 4వ బృహత్ కవి సమ్మేళనంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ప్రజాసంక్షేమ కార్యక్రమాలను కవులు,రచయితలు ప్రజలకు చేరవేయాలని అన్నారు. హరిత హారం కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని అన్నారు. తెలంగాణ సాహిత్యాన్ని పెంపొందించేందుకు ఈ సమావేశాలు దోహదం చేస్తాయని తెలిపారు. కార్యక్రమానికి ప్రముఖ కవి ఉదాది నారాయణ అధ్యక్షత వహించారు.