రాష్ట్రీయం

రాష్టప్రతి నోట తెలుగు మాట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ప్రపంచ తెలుగు మహాసభల ముగింపులో రాష్టప్రతి రామ్‌నాథ్ కోవింద్ తెలుగులో మాట్లాడి భాషాభిమానుల హృదయాలను దోచుకున్నారు. ప్రసంగాన్ని ‘సోదర సోదరీమణులారా! నమస్కారం’ అంటూ ప్రారంభించి సభికుల కరతాళధ్వనులు అందుకున్నారు. శ్రీకృష్ణదేవరాయలు రచించిన ఆముక్తమాల్యదను గుర్తు చేస్తూ ‘దేశభాషలందు తెలుగులెస్స’ అనడంతో సభ చప్పట్లతో మార్మోగింది. కోవింద్ తన ప్రసంగం చివరలో రాయప్రోలు సుబ్బారావు రాసిన పాటను గుర్తు చేసుకుంటూ.. ‘ఏ దేశమేగినా ఎందుకాలిడినా/ పొగడరా నీ తల్లి భూమి భారతిని/ నిలుపరా నీ జాతి నిండు గౌరవము’ అంటూ సభకు నిండుదనం తెచ్చారు.