రాష్ట్రీయం

సిటిజన్ -నెటిజన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, డిసెంబర్ 25: కేవలం నెలకు రూ.149కే టెలివిజన్, టెలిఫోన్, ఇంటర్నెట్ సదుపాయం (డేటా, వాయిస్, వీడియో సేవలు) సమకూరను న్నాయ. ఫైబర్‌నెట్‌తో విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు బాట వేయాలన్న చంద్రబాబు దార్శనికతకు ఈ ప్రాజెక్టు అద్దంపడు తుంది. విద్యుత్ స్తంభాలు ఆసరాగా ఫైబర్ గ్రిడ్ పథకం రూపుదిద్దుకుంది. భూగర్భ కేబుల్స్‌తో రూ.5వేల కోట్ల వ్యయం కాగల ప్రాజెక్టును, కరెంటు స్తంభాల ఆధారంగా డిజైన్‌చేసి కేవలం రూ.400 కోట్ల వ్యయంతోనే రూపకల్పన చేశారు. హై స్పీడ్ ఆప్టికల్ ఫైబర్ వౌలిక సదుపాయంతో ఆంధ్రలో అన్ని పట్టణాలు, మారుమూల గ్రామాలు సైతం ఇంటర్నెట్‌తో అనుసంధానమవుతాయి. గృహ వినియోగదారులే కాకుండా వ్యాపా ర, వాణిజ్య వర్గాల వారి అవసరాలకూ ఫైబర్ నెట్ సేవలు అందుతాయ. రాష్ట్ర ప్రభుత్వం రూ.4వేల ఖరీదైన సెట్ టాప్ బాక్సును నెలకు రూ.99 వంతున చెల్లించి
కొనుగోలు చేసే అవకాశం కల్పించిందని ఏపీ ఎస్‌ఎఫ్‌ఎల్ మేనేజింగ్ డైరెక్టర్ అహ్మద్ బాబు తెలిపారు. కనెక్షన్ తీసుకున్న వినియోగదారుడు 24 గంటల వైఫై సేవలు పొందవచ్చు. టీవీని కంప్యూటర్‌గానూ ఉపయోగించుకునే సదుపాయం ఉంది. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐఓటి) సాంకేతికతతో రూపుదిద్దుకున్న ఫైబర్ నెట్ ద్వారా వినియోగదారుడు తన మొబైల్ ఫోన్‌నే రిమోట్‌గా ఉపయోగించుకోవచ్చు. వీడియోకాల్ చేసుకునే సదుపాయం ఉంది. కనీస ప్యాకేజీ కింద నెలకు రూ.149 చెల్లిస్తే 5 జీబీ ఉపయోగించుకునేలా, 15 ఎంబీపీఎస్ సామర్థ్యం కలిగిన సేవలు అందుతాయి. స్టాండర్డ్ ప్యాకేజీలో రూ.399 చెల్లిస్తే 25 జీబీ దాకా ఉపయోగించుకోవచ్చు. అలాగే 50 జీబీ ఉపయోగించుకునే ప్రీమియం ప్యాకేజీ సదుపాయాన్ని ప్రభుత్వం ప్రజల ముందుకు తెస్తోంది. ఏ ప్యాకేజీ తీసుకున్నా 250 టీవీ ఛానెళ్లను చూడవచ్చు.