రాష్ట్రీయం
మెట్రోరైలు, ఎల్ అండ్ టీ ఎండీగా కేవీబీ రెడ్డి నియామకం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Friday, 26 January 2018
హైదరాబాద్, జనవరి 25: హైదరాబాద్ మెట్రోరైలు, ఎల్ అండ్ టీ ఎండీగా ఎస్సార్ పవర్ లిమిటెడ్ కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటీవ్ ఆఫీసర్ కేవీబీ రెడ్డిని నియమిస్తూ ప్రభుత్వం గురువారం ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం ఎల్ అండ్ టీ ఎండీగా వ్యవహారిస్తున్న శివానంద్ నంబూర్గి స్థానంలో ఆయన్ను నియమిస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. భోపాల్లోని రీజినల్ ఇంజనీరింగ్ కాలేజీ నుంచి మెకానికల్ ఇంజనీరింగ్లో డిగ్రీ పూర్తి చేసిన ఆయన 1983లోదిల్లీలోని ఎన్టీపీసీలో తన కెరీర్ను ప్రారంభించారు. ఎస్సార్ పవర్ లిమిటెడ్ సంస్థతో ఇరవై రెండేళ్ల అనుబంధం ఉన్న కేవీబీ రెడ్డి హైదరాబాద్ మెట్రోరైలు ఎల్ అండ్ టీ సంస్థకు ఎండీగా త్వరలోనే ఎల్ అండ్ టీ సీఈవో సుబ్రహ్మణ్యన్కు రిపోర్టు చేయనున్నట్లు తెలిసింది.