రాష్ట్రీయం

గాంధీ భవన్‌లో గలభా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 26: టి.కాంగ్రెస్ కార్యాలయమైన గాంధీభవన్‌లో శుక్రవారం అనూహ్యంగా నాయకుల మధ్య వాగ్యుద్ధం తలెత్తింది. టి.పిసిసి ప్రధాన కార్యదర్శి టి. నిరంజన్, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు నేరేళ్ళ శారద మధ్య తీవ్రస్థాయలో మాటామాటా జరిగినట్లు సమాచారం. రిపబ్లిక్-డే సందర్భంగా టి.పిసిసి చీఫ్ ఎన్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి పార్టీ పతాకాన్ని ఆవిష్కరించిన అనంతరం పార్టీ ముఖ్య నేతలు సమావేశమయ్యారు. సమావేశంలో ఏఐసిసి నాయకుడు, మాజీ ఎంపి వి హనుమంత రావు మాట్లాడుతూ గవర్నర్ నరసింహన్ వ్యవహారిస్తున్న తీరు బాగా లేదు కాబట్టి ఇకమీదట గవర్నర్‌ను కలిసి ఎలాంటి వినతి పత్రాలు ఇవ్వరాదని భావించామని, అయినా పార్టీ నాయకులు గురువారం ఎందు కు వెళ్ళారని ప్రశ్నించారు. శాసనమండలి (కౌన్సిల్) లో ప్రతిపక్ష నేత మహ్మద్ షబ్బీర్ అలీ, ఎమ్మెల్యే ఎ రేవంత్ రెడ్డి గవర్నర్‌ను కలిసి వినతి పత్రం అందించిన సంగతి తెలిసిందే. ఇలాఉండగా విహెచ్ వ్యాఖ్య ల పట్ల సమావేశంలో పాల్గొన్న నాయకులు కొందరు ఏకీభవించారని తెలిసింది. కాగా షబ్బీర్ అలీ మాత్రం తాము వినతి పత్రం ఇవ్వలేదని, క్యాబినెట్ ర్యాంకు ఇచ్చిన టిఆర్‌ఎస్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని చెప్పామని, ఇది చాలా ముఖ్యమైన అంశమని చెప్పినట్లు తెలిసింది. ఈ సమయంలోనే మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఎన్. శారద సమావేశానికి హాజరయ్యారు. తాను వచ్చే నెలలో మహబూబ్‌నగర్‌లో నిర్వహించబోయే మహిళా సాధికారత సదస్సు కు జాతీయ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు, ఇతర ప్రముఖులు హాజరవుతారు కాబట్టి పార్టీ నాయకులందరూ హాజరు కావాలని సహకారం అందించాలని కోరారు. అందుకు విహెచ్ కల్పించుకుని ‘సహకారం ఉంటుంది కానీ మీరు ముందుండాలి కదమ్మా..’ అని అన్నారు. అందుకు శారద స్పందిస్తూ తాను ఏర్పాట్లలో కొంత బిజీగా ఉండి సమావేశానికి ఆలస్యంగా వచ్చానని, తాను ఎంత కష్టపడినా తననే అంటుంటారని వాపోయారు. ఈ దశలో టి.నిరంజన్ కల్పించుకోవడంతో ఆమెకు నిరంజన్‌కు మధ్య మాట-మాట పెరిగి తీవ్ర స్థాయిలో వాగ్వాదం జరిగింది. చివరకు ఉత్తమ్‌కుమార్ రెడ్డి కల్పించుకుని వారికి నచ్చజెప్పారు. నిరంజన్ కోపంతో సమావేశం నుంచి బయటకు వెళ్ళిపోయారు. విహెచ్ మాట్లాడుతూ తాను ఈ సమావేశానికి రావడంలో ముందుండాలని అనలేదని, వచ్చే నెలలో జరగబోయే సమావేశం ఏర్పాట్లలో ముఖ్యులను స్వాగతం పలకడంలో ముందుండాలన్న భావనతో అన్నానని చెప్పినట్లు తెలిసింది.