రాష్ట్రీయం

మేడారం జాతరకు 16 ప్రత్యేక రైళ్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 27: తెలంగాణలో జరిగే మేడారం జాతరకు 16 ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. సికింద్రాబాద్-వరంగల్-హైదరాబాద్ మధ్య 8, కాజీపేట-సిర్పూర్,-కాగజ్‌నగర్ మధ్య 2, సిర్పూర్ కాగజ్‌నగర్-ఖమ్మం-సిర్పూర్,కాగజ్‌నగర్ మధ్య ఆరు ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు రైల్వే తెలిపింది. జనవరి 31, ఫిబ్రవరి 1,2,3 తేదీల్లో సికింద్రాబాద్ నుంచి వరంగల్‌కు ప్రత్యేక రైలు మధ్యాహ్నం 12.30కి బయలుదేరి, అదే రోజు మధ్యాహ్నం 3.40 గంటలకు వరంగల్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో వరంగల్ నుంచి అదే రోజుల్లో సాయంత్రం 5.45కి బయలుదేరి అదే రోజు రాత్రి 9.30కి హైదరాబాద్ స్టేషన్‌కు చేరుకుంటుంది. కాజీపేట నుంచి జనవరి 31న రాత్రి 7 గంటలకు ప్రత్యేక రైలు బయలుదేరి అదే రోజు రాత్రి 11 గంటలకు సిర్పూర్ కాగజ్‌నగర్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఫిబ్రవరి 4న సిర్పూర్ నుంచి సాయంత్రం 5.30 గంటలకు బయలుదేరి అదే రోజు రాత్రి 9 గంటలకు కాజిపేట చేరుకుంటుంది. ఫిబ్రవరి 1,2,3 తేదీల్లో సిర్పూర్ నుంచి ఉదయం 5.30కి బయలు దేరి అదే రోజు ఉదయం 11.15కి ఖమ్మం చేరుకుంటుంది. అలాగే తిరుగు ప్రయాణంలో అదేరోజు సాయంత్రం 4.45కి ఖమ్మం నుంచి బయలుదేరి రాత్రి 11 గంటలకు సిర్పూర్ చేరుకుంటుందని రైల్వే తెలిపింది. ఈ సౌకర్యాన్ని మేడారం జాతరకు వెళ్లే భక్తులు వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేసింది.