రాష్ట్రీయం

హైదరాబాద్ చేరుకున్న ఉప రాష్టప్రతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 10: భారత ఉప రాష్టప్రతి ఎం వెంకయ్యనాయుడు శనివారం నాడు హైదరాబాద్ వచ్చారు. బేగంపేట విమానాశ్రయంలో ఆయనకు రాష్ట్ర గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్, నగర జాయింట్ కమిషనర్ శివప్రసాద్, ప్రోటోకాల్ అధికారులు, పోలీసు అధికారులు, హైదరాబాద్ కలెక్టర్ యోగిత రానా ఘనస్వాగతం పలికారు. బీమా నియంత్రణ అభివృద్ధి సాధికార సంస్థ హైదరాబాద్‌లో నిర్వహిస్తున్న అంతర్జాతీయ బీమా సదస్సు ముగింపు కార్యక్రమంలో 11వ తేదీన పాల్గొంటారు. ఈ సదస్సు రెండు రోజులుగా హైదరాబాద్‌లో జరుగుతోంది. దక్షిణాసియా ప్రాంతానికి చెందిన 400 మంది ప్రతినిథులు ఈ సదస్సుకు హాజరయ్యారు.