రాష్ట్రీయం

గుణదల కొండకు బారులుతీరిన భక్తులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (పటమట) ఫిబ్రవరి 10: విజయవాడ గుణదలమాత మహోత్సవాల రెండో రోజు శనివారం గుణదల కొండకు భక్తులు పోటెత్తారు. తెలుగు రాష్ట్రాలతోపాటు, ప్రక్క రాష్ట్రాల నుండి భక్తులు మరియమాత ఉత్సవాలకు లక్షలాదిగా తరలిరావటంతో పరిసర ప్రాంతాలన్నీ జనసంద్రంగా మారాయి. కొండపై గుణదలమాత (మరియమాత)ను, కొండ శిఖరాన ఏసుక్రీస్తును శిలువను భక్తులు బారులు తీరి దర్శించుకున్నారు. అమ్మ వందనం.. మరియమ్మ వందనం అంటూ భక్తులు కొండపైకి చేరుకొని మరియమాత వద్ద తలనీలాలు సమర్పించుకుని, టెంకాయలు కొట్టి మొక్కుబడులు తీర్చుకున్నారు. రెండో రోజు ఉత్సవాలకు కర్నూలు మేత్రాసనం బిషప్ పూల ఆంథోని ముఖ్యఅతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా భక్తులకు ఆయన సందేశమిస్తూ మహిమాన్వితం గుణదలమాత పుణ్యక్షేత్రం అన్నారు. స్ర్తిలందరిలో మరియమాత ధన్యురాలని పేర్కొన్నారు. గుణదలమాతను దర్శించుకున్న భక్తులకు అనేక మేళ్లు జరుగుతున్నాయని వివరించారు. మరియతల్లి త్యాగమూర్తిగా ఈ విశ్వంలో నిలిచిందని తెలిపారు. ప్రేమతత్వంతో మూర్త్భివించిన తల్లి అన్నారు. బిషప్ గ్రాసి హైస్కూల్ గ్రౌండ్‌లో ప్రత్యేకంగా అలంకరించిన పూజాపీఠంపై విజయవాడ కతోలిక పీఠం బిషప్ తెలగతోటి జోసఫ్ రాజారావు, కర్నూలు కతోలిక పీఠం బిషప్ పూల ఆంథోని, వికార్ జనరల్ ఎం.గాబ్రియేలు, గుణదలమాత పుణ్యక్షేత్రం రెక్టర్ యేలేటి విలియం జయరాజు తదితర గురువులు ‘సమష్టి దివ్యపూజాబలి, సమర్పించారు. పూజానంతరం కతోలిక భక్తులకు గురువులు దివ్యసత్ప్రసాదం అందచేశారు. ఈ కార్యక్రమంలో విజయవాడ కతోలిక పీఠం మోన్సిగ్నోర్ ఫాదర్ మువ్వలప్రసాద్, ఎస్‌ఎస్‌సి డైరెక్టర్ ఫాదర్ పసల తోమస్, ఫాదర్ ఇంటి అంతోని తదితర గురువులు, సిస్టర్లు, అశేష సంఖ్యలో భక్తులు హాజరయ్యారు.

చిత్రం..కొండ శిఖరాన ఏసుక్రీస్తు శిలువ వద్ద ప్రార్థనలు చేస్తున్న భక్తులు