రాష్ట్రీయం

ఢిల్లీలో 15న నీటిపారుథలశాఖ మంత్రుల సమావేశం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 12: కేంద్ర జల వనరుల మంత్రిత్వశాఖ అధ్వర్యంలో ఈ నెల 15న ఢిల్లీలో రాష్ట్రాల నీటిపారుదలశాఖ మంత్రులు, ఆయా రాష్ట్రాల నీటిపారుదల, ఆర్థికశాఖల ముఖ్య కార్యదర్శులు, కేంద్ర జల సంఘం చైర్మన్, నాబార్డు చైర్మన్ తదితర ఉన్నతాధికారులతో సమావేశం ఏర్పాటు చేసింది. కేంద్ర జల వనరులశాఖ మంత్రి నితిన్ గడ్కరీ అధ్యక్షతన జరిగే ఈ సమావేశానికి హాజరు కావాల్సిందిగా నీటిపారుదలశాఖ మంత్రి టి హరీశ్‌రావుకు ఈ మేరకు ఆహ్వానం అందింది. దేశవ్యాప్తంగా ప్రాధాన్యతా క్రమంలో ప్రధాన మంత్రి కృషి సించాయ్ యోజన కింద చేపట్టిన 99 సాగునీటి పథకాలకు అవసరమైన నిధులు, ఇప్పటి వరకు నాబార్డు నుంచి అందించిన ఆర్థిక సహాయంతో పాటు ఇతర అంశాలపై చర్చించి తదుపరి తీసుకోవాల్సిన చర్యలపై ఈ సమావేశంలో నిర్ణయం తీసుకుంటారు. ఢిల్లీలో శ్రమశక్తి భవన్‌లో ఈ నెల 15న మధ్యాహ్నం 1.30 గంటలకు ఈ సమావేశం జరుగనుందని మంత్రి హరీశ్‌రావుకు పంపిన ఆహ్వానంలో పేర్కొన్నారు.