రాష్ట్రీయం

బాసరలో ఘోరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాసర, మార్చి 7: బాసర మండల కేంద్రంలో బుధవారం ఉదయం జంట హత్య లు కలకలంరేపింది. భైంసా నుండి నిజామాబాద్ వైపు వెళ్లే రహదారి పక్కన రైల్వేస్టేషన్‌కు సమీపాన స్టార్ ఇన్ రెస్టారెంట్ యజమాని రతీష్ (45), తండ్రి గోపీనాథ్ (65)లను గుర్తుతెలియని దుండగులు అర్ధరాత్రి అతి కిరాతకంగా గొంతుకోసి హత్యచేశారు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పనె్నండేళ్ల క్రితం బాసరకు ఉపాధినిమిత్తం వచ్చిన రతీష్ స్టారిన్ రెస్టారెంట్‌ను నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. అతనికి భార్య, కుమారుడు ఉన్నారు. ఎప్పటిలాగే మంగళవారం రాత్రి 11 గంటలకు రెస్టారెంట్ మూసేసి లోపలనే పడుకున్నారు. ఉదయం 9 గంటలవుతున్నా యజమాని బయటకు రాకపోవడంతో రెస్టారెంట్‌లో పనిచేసే సిబ్బంది యజమాని రతీష్‌ను లేపేందుకు లోపలికి వెళ్లి చూసేసరికి రక్తపు మడుగులో పడివున్నాడు. రెస్టారెంట్ సిబ్బంది స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. ఎస్సై మహేష్, తన సిబ్బందితో కలిసి స్టార్ ఇన్ రెస్టారెంట్‌కు చేరుకుని ఘటనా స్థలాన్ని పరిశీలించారు. హత్యజరిగిన తీరును ఉన్నతాధికారులకు వివరించారు. ఘటన స్థలానికి చేరుకున్న జిల్లా ఎస్పీ విష్ణు ఎస్ వారియర్ ఘటనా స్థలాన్ని పరిశీలించి పోలీసు సిబ్బందికి పలు సూచనలు జారీచేశారు. ఘటనా స్థలాన్ని డాగ్‌స్క్వాడ్ క్లూజ్‌టీమ్‌లతో పరిశీలించి అన్నికోణాల్లో దర్యాప్తు చేస్తామన్నారు. ఎస్పీ ఆదేశానుసారం పోలీసులు డాగ్‌స్క్వాడ్‌తో హత్యజరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. డాగ్‌స్క్వాడ్ భైంసావైపు ట్రిపుల్ ఐటీ దగ్గర వరకు వెళ్లి ఆగిపోయింది. క్లూస్‌టీమ్ సిబ్బంది ఘటనా స్థలంలో కూరగాయలు కోసే కత్తి మరికొన్ని వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. దుండగులు హత్యలు చేసిన అనంతరం యజమాని ఏర్పాటు చేసిన సీసీ టీవీ పుటేజిని సైతం వెంట తీసుకెళ్లినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. సంఘటనా స్థలంలో బీరువాలోని వస్తువులు చిందరవందరగా పడివున్నాయి. గుర్తుతెలియని దుండగులా? లేక పార్థి ముఠా సభ్యుల పనా? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ముధోల్ ప్రాంతీయ ఆసుపత్రికి తరలించి కేసు దర్యాప్తుచేస్తున్నట్టు ఎస్సై మహేష్ తెలిపారు.
chitram...
బాసరలో జంట హత్యలు చోటుచేసుకున్న రెస్టారెంట్ వద్ద గుమిగూడిన స్థానికులు