ఆంధ్రప్రదేశ్‌

కేంద్రంపై ఒత్తిడి తేవాలి : చలసాని

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనకాపల్లి, మార్చి 21: రాష్టమ్రంతా ఒకేమాట మీద ఉండి నేతలంతా కలసికట్టుగా నిలబడి ప్రత్యేక హోదా కోసం కేంద్రంపై ఒత్తిడి తీవ్రతంర చేయాలని ప్రత్యేక హోదా సాధన సమితి కన్వీనర్ చలసాని శ్రీనివాస్ పిలుపునిచ్చారు. బుధవారం ఇక్కడ ప్రత్యేక హోదా సాధన ఆవశ్యకతపై విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఏపీకీ ప్రత్యేక హోదా రాకపోవడానికి అటు మోదీ ప్రభుత్వం, ఇటు చంద్రబాబు ప్రభుత్వాలు బాధ్యత వహించాలన్నారు. ఏపీపై మోదీకి, ఆయన ప్రభుత్వానికి చాలా చిన్నచూపు ఉందన్నారు. ఈ విషయాన్ని సీఎం చంద్రబాబు చాలా ఆలస్యంగా తెలుసుకున్నా ఇప్పుడు పోరాటానికి దిగడం మంచిదేనన్నారు. ప్రత్యేక హోదా ప్రకటిస్తే తప్ప మనుగడ ఉండబోదన్నారు. రాజకీయ స్వప్రయోజనాలను పక్కనపెట్టి బీజీపీయేతర రాజకీయ పక్షాలన్నీ ఒకేవేదికపైకి వచ్చి ప్రత్యేక హోదా సాధన కోసం మోదీ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలన్నారు.