రాష్ట్రీయం

4న ఢిల్లీకి కేసీఆర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేయాలన్న పట్టుదలతో ఉన్న టీఆర్‌ఎస్ అధ్యక్షుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు వచ్చే నెల 4న ఢిల్లీ వెళ్ళే ఆలోచనలో ఉన్నారు. తొలి విడతగా గత వారం కోల్‌కతాకు వెళ్లి తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో మంతనాలు జరిపిన సంగతి తెలిసిందే. మలి విడతలో కాంగ్రెస్, బీజేపీ యేతర భావసారూప్యతగల జాతీయ పార్టీల నేతలతో మంతనాలు జరపాలని ఆలోచిస్తున్నారు. ఢిల్లీకి వెళ్ళినప్పుడు ఏయే పార్టీ నేతలతో మంతనాలు జరపాలన్న అంశంపై ముఖ్యమంత్రి కేసీఆర్ శనివారం తన ఆంతరంగికులతో చర్చించారు. తమ పార్టీ తరఫున రాజ్యసభకు ఎన్నికైన బండ ప్రకాష్, జోగినిపల్లి సంతోష్ కుమార్, బడగుల లింగయ్య యాదవ్ రాజ్యసభలో చేసే ప్రమాణ స్వీకారోత్సవానికీ హాజరుకావచ్చని ఆయన భావిస్తున్నట్లు సమాచారం.