ఆంధ్రప్రదేశ్‌

మైనారిటీ యువతను బలిచేస్తున్న జగన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, సెప్టెంబర్ 4: స్వప్రయోజనాల కోసం వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ముస్లిం యువతను బలిచేస్తున్నారని మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఎండి హిదాయత్ ధ్వజమెత్తారు. మంగళవారం సచివాలయంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ముస్లింల సంక్షేమానికి తెలుగుదేశం ప్రభుత్వం చిత్తశుద్దితో పనిచేస్తోందన్నారు. గుంటూరులో ఇటీవల నిర్వహించిన నారా హమారా- టీడీపీ హమారా కార్యక్రమంలో అల్లర్లు ప్రేరేపించేందుకు కర్నూలు జిల్లాకు చెందిన 8 మంది వైసీపీ కార్యకర్తలను పురమాయించడం ద్వారా వారి భవిష్యత్తుతో ప్రతిపక్ష పార్టీ చెలగాట మాడుతోందని ఆరోపించారు. ముస్లిం మైనారిటీలను వైఎస్ హయాం నుంచి ఓటుబ్యాంక్‌గా వాడుకున్నారని, వారి సంక్షేమానికి ఏ మాత్రం చొరవచూపలేదని విమర్శించారు. రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ హయాంలో 61వేల ఎకరాల వక్ఫ్ భూములు ఉంటే 29వేల ఎకరాలు కబ్జా చేశారని టీడీపీ అధికారంలోకి వచ్చాక ఐదువేల ఎకరాలు స్వాధీనం చేసుకుందని చెప్పారు. గత నాలుగేళ్లలో సెంటు భూమి కూడా అన్యాక్రాంతం కాలేదన్నారు. వైసీపీ ముస్లిం మైనారిటీలను పావులుగా వాడుకుంటోందని మండిపడ్డారు. టీడీపీలోనే తమకు అత్యధిక ప్రాధాన్యత వచ్చిందన్నారు. శాసనమండలి చైర్మన్, విప్‌లతో పాటు రెండు జడ్పీ చైర్మన్లు, మునిసిపల్ చైర్మన్లుగా అవకాశం ఇచ్చిందన్నారు. నామినేటెడ్ పదవులలో ఆరు కార్పొరేషన్లకు చైర్మన్లుగా ప్రాతినిధ్యం కల్పించారన్నారు. ఇతర రాజకీయ పార్టీల సభల్లో అలజడులు సృష్టించటం వైసీపీ సంస్కృతి అని ఆరోపించారు. నారా హమారా సభ ద్వారా అదనంగా రూ 12 వందల కోట్ల మేర ప్రయోజనం కలిగించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు మైనారిటీలకు వరాల జల్లు కురిపించారని, రాష్ట్ర వ్యాప్తంగా ఐదువేల మంది మతపెద్దలు, వందమంది ఇమాంలు, 15వేల మంది ముస్లిం మహిళలతో పాటు లక్ష మంది వరకు హాజరై ప్రభుత్వం పట్ల విశ్వసనీయత చాటుకుంటే వైసీపీకి గుండెల్లో రైళ్లు పరిగెత్తాయని విమర్శించారు.