ఆంధ్రప్రదేశ్‌

వైసీపీ ఎంపీల డ్రామాలు బట్టబయలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ(సిటీ), అక్టోబర్ 6: ఏపీకి ప్రత్యేక హోదాతో పాటు విభజన హామీలను సాధించడంలో వైసీపీ ఎంపీలు మొదటి నుండి డ్రామాలు ఆడుతున్నారని ఆంధ్రప్రదేశ్ ఐటీ, పంచాయితీ, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి నారా లోకేష్ విమర్శించారు. ఏపీలో ఖాళీగా ఉన్న ఐదు పార్లమెంట్ స్థానాలకు ఉపఎన్నికలు లేవని ఈసీ స్పష్టం చేసిన నేపథ్యంలో మంత్రి నారా లోకేష్ శనివారం ట్విట్టర్ ద్వారా స్పందించారు. ఉపఎన్నికలు రావని తెలిసే వైసీపీ ఎంపీలు రాజీనామా డ్రామాలాడారని ఎద్దేవా చేశారు. ఈసీ ప్రకటనతో లోపాయికారీ ఒప్పందం బహిర్గతమైయిందన్నారు. వైసీపీ ఎంపీలు కేంద్రంతో రాజీపడి ఏపీ ప్రజలకు నామం పెట్టారని విమర్శించారు. ఏపీ ప్రజలను కేంద్రానికి తాకట్టు పెట్టాలని ప్రయత్నించిన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ కుయుక్తులకు ప్రజలే సమాధానం చెబుతారని ట్విట్టర్‌లో లోకేష్ స్పష్టం చేశారు.