ఆంధ్రప్రదేశ్‌

విభేదాలు వీడకపోతే సీటు మరొకరికి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, అక్టోబర్ 6: చిత్తూరు జిల్లా నగరి శాసనసభ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీలో రగులుతున్న గ్రూపుల పోరుపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. మాజీ మంత్రి గాలి ముద్దుకృష్ణమనాయుడు మృతిచెందిన నేపథ్యంలో ఆయన వారసులకు వచ్చే ఎన్నికల్లో సీటిస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. అయితే వారసుల మధ్య విభేదాలు చోటు చేసుకోవటంతో పేచీ తలెత్తింది. ఈ నేపథ్యంలో శనివారం ఉండవల్లి ప్రజావేదిక వద్ద నగరి నియోజక వర్గ పరిధిలోని మండల, గ్రామ స్థాయి నాయకులు చంద్రబాబును కలుసుకుని కొద్దిసేపు చర్చించారు. అభ్యర్థి ఎంపిక బాధ్యతను ఏకపక్షంగా పార్టీనేతలు ముఖ్యమంత్రికి అప్పగించారు. నియోజకవర్గానికి అభ్యర్థి పేరు ప్రతిపాదించేందుకు చంద్రబాబు రెండురోజులు గడువిచ్చారు. శాసనసభ స్థానానికి పోటీచేసే విషయంలో విభేదాలు ఇలాగే కొనసాగితే మరొకరికి సీటిస్తామని స్పష్టం చేశారు.