ఆంధ్రప్రదేశ్‌

బీజేపీ కుట్ర రాజకీయాలపై ముస్లింలలో చైతన్యం తేవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఆగస్టు 2: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఏపీకి చేసిన అన్యాయం, ప్రతిపక్షాలతో కలిసి చేస్తున్న కుట్ర రాజకీయాలపై ముస్లింల్లో చైతన్యం తేవాల్సి ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభిప్రాయపడ్డారు. వెలగపూడి సచివాలయంలో సీఎంను ముస్లిం మైనారిటీ నేతలు గురువారం కలిసి గుంటూరులో ఈ నెల 28న నిర్వహించనున్న ముస్లింల బహిరంగ సభ వివరాలను వివరించారు. ఈ సభను విజయవంతం చేసేందుకు చలో గుంటూరు పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం నిర్వహిస్తున్నామన్నారు. ఈ సందర్భంగా ముస్లింల సభకు సంబంధించిన పోస్టర్‌ను, కరప్రతాలను సీఎం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ముస్లింలందరూ టీడీపీకే ఓటు వేస్తారనడంలో సందేహం లేదన్నారు.